తెలుగు బుల్లి తెర ప్రేక్షకులందరికీ ఎంతో ఇష్టమైన యాంకర్ సుమ. ఆమె ఈ ఛానెల్ ఆ ఛానెల్ అనకుండా ప్రతీ ఛానెల్ లో ప్రోగ్రాంలు చేస్తూ.. బిజీగా ఉంటుంది. ఆమె స్టేజ్ మీద ఉన్నప్పుడు ముఖంలో చిరునవ్వును చరగనీయకుండా యాంకరింగ్ చేస్తుంది. ఎప్పటి కప్పుడూ తన మాటల చమర్కరంతో ప్రేక్షకులను ఇట్టే కట్టి పడేస్తుంది. ఇంకా చెప్పాలంటే తెలుగు టీవీ యాంకర్లలో తనే మొదటి స్థాన్నాని ఆక్రమించిందని చెప్పొచ్చు.
అలాగే ఆమె భర్త రాజీవ్ కనకాల సినిమాల్లో యాక్టింగ్ చేస్తూ.. బిజీగా ఉంటారు. ఈ మధ్య వెబ్ సిరీస్ లో కూడా చేస్తూ ప్రేక్షకులను ఆనంద పరుస్తున్నారు. అయితే ఈ దంపుతుల మధ్య గొడవలు వచ్చాయి. విడాకులు కూడా తీసుకోబోతున్నారని ఎన్నో పుకార్లు షికారు చేశాయి. దానికి సమాధానంగా వారి పిల్లలను విదేశాలకు పంపించినట్లు పుకార్లను సృష్టించారు. అలాగే సుమ కూడా రాజీవ్ కు దూరంగా ఉంటుందని వార్తలను రాసుకొచ్చారు.
దీనిపై రాజీవ్ గానీ సుమ గానీ ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు. ఒకవేళ రియాక్ట్ అయితే అది ఎటు పోతుందో అని ఆలోచించారో ఏమో.. దానికి సమాధానంగా వాళ్లు కలిసి ఉన్న ఫొటోలు, విడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. పూకార్లను నమ్మొద్దనే విధంగా సూచించారు. దాంతో గాసిప్ లు రాసేవాళ్లకు నోరు మూసుకోవలసిన పని పడింది.
అయితే ఈ డైవర్స్ ఇష్యూపై రాజీవ్ కనకాల ఒక ఛానల్ లో మాట్లాడారు. ఆ ఛానెక్ ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో పలు విషయాలను పంచుకున్నాడు. డైవర్స్ విషయం అంటూ వచ్చిన వార్తలవల్ల సుమ ఎంత బాధ పడిందో తెలియజేశారు. సుమకు ఆయనకు మధ్య చిన్న గొడవైనట్టు తెలిపారు. అది అందరి ఇళ్లల్లోలాగే అని తెలిపారు. దాన్ని మార్చి మార్చి రాస్తూ చివరకు డైవర్స్ కాడికి తీసుకొచ్చారని తెలిపారు. ఆ న్యూస్ చూసి ఆయన షాకైనట్లు తెలిపారు.
విడాకులు తీసుకునే వరకూ తీకుకొచ్చారా అని అనుకున్నామని తెలిపారు. దానికి రెస్పాండ్ అయితే బాగోదని తెలిపారు. దాంతో అందరికీ తెలిసేలా ఫొటోలు, విడియోలాను పోస్ట్ చేశామని తెలిపారు. ఇలాంటి విషయాల వల్ల పిల్లలపై ఎఫెక్ట్ పడుతుందని తెలిపారు సుమకు ఓపిక ఎక్కువ కాబట్టే ఇలాంటివి పట్టించుకోదని తెలిపాడు. ఆమె ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుందని తెలిపాడు. ఆదే ఆమెలో నాకు చాలా నచ్చే విషయమని రాజీవ్ చెప్పుకొచ్చాడు.