మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కి సౌత్ సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాతవాసి సినిమాలు ఒక రకమైన క్రేజ్ ని తీసుకు వస్తే మహానటి సినిమా సౌత్ సినిమా ఇండస్ట్రీతో పాటు నార్త్ లో కూడా గుర్తింపు వచ్చేలా చేసింది. అంతేకాదు ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ లోను కీర్తి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం తన చేతిలో 6 సినిమాలున్నాయి. వాటిలో తెలుగులో ‘రంగ్ దే’.. ‘గుడ్ లక్ సఖి’, తమిళంలో ‘అన్నాతే’..’మిస్ ఇండియా’ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారి పాట సినిమాలు కీర్తి చేతిలో ఉన్నాయి.
అయితే ప్రభాస్ నటించబోతున్న భారీ పాన్ ఇండియన్ సినిమా ఆది పురుష్ లో సీతగా నటించే అవకాశాలున్నాయని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కీర్తి చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ క్రేజీ ప్రాజెక్ట్సే. అయితే మరో క్రేజీ ప్రాజెక్ట్ కీర్తి చేతికొచ్చిందని సమాచారం. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ దర్శకుడు తేజ యాక్షన్ హీరో గోపీచంద్ తో ఒక సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
గోపీచంద్ కి విలన్ క్యారెక్టర్స్ ఇచ్చి లైఫ్ ఇచ్చిన తేజ ఈసారి గోపీచంద్ ని హీరోగా పెట్టి సినిమా చేయబోతున్నాడు. ‘అలివేలుమంగ వేంకటరమణ’ అన్న పేరుతో ఈ సినిమా తెరకెక్కనుండగా అలివేలుమంగ గా నటించే హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. గతకొన్ని రోజులుగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ అనుష్క షెట్టి అని కాజల్ అగర్వాల్ అని ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవలే అనుష్క నటించిన నిశ్శబ్ధం రిలీజై ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది.
ఇక కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరసగా సినిమాలు కమిటయి బిజీగా ఉంది. దానికి తోడు ఈ నెల 30 న పెళ్ళి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించబోతుంది. కాబట్టి కాజల్ ఈ సినిమాలో నటించే సమయం దొరకడం కష్టమే. అందుకే ఈ ఛాన్స్ కీర్తి సురేష్ కి దక్కిందని అంటున్నారు. ఇంకా అధికారకంగా ఈ విషయం వెల్లడికాలేదు. ఒకవేళ ఇదే గనక నిజమైతే కీర్తి సురేష్ కి మరో క్రేజీ ప్రాజెక్ట్ పడ్డట్టే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?