Nadhiya: కొంత మంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి కొంతకాలం నటించాక కనుమరుగైపోతూ ఉంటారు అలాగే ఇంకొంతమంది హీరోయిన్స్ అయితే ఎంత వయసు వచ్చినప్పటికీ నిత్య యవ్వనంగానే ఉంటారు. హీరోయిన్ నదియా Nadhiya కూడా ఈ కోవకి చెందిన వారే. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇంక అప్పటి నుంచి ఆమె తెలుగు లో మోస్ట్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయిపోయారు. ప్రస్తుతం ఈమె వరుణ్ తేజ్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషితున్నట్లు సమాచారం.
నదియా సినీ జీవితం మన అందరికి తెలిసిందే కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి చాలా చాలా తక్కువ మందికే తెలుసు. నదియా వాళ్ళ తల్లిదంద్రులకు ఈమె ఏకైక కుమార్తె. చదువుకుంటున్న సమయంలోనే ఈమెకు సినిమాల్లో నటించడానికి అవకాశం రావడంతో చదువును పక్కనపెట్టి సినీ పరిశ్రమ వైపు అడుగులు వేశారు. ఇక నదియా మొదటి సినిమా 1984వ సంవత్సరంలో విడుదల అయ్యింది. ఇది ఒక మలయాళ సినిమా. మొదటి సినిమాతోనే ఈమెకు ఫిలింఫేర్ అవార్డు దక్కింది.
ఆ తరువాత సినీ ఇండస్ట్రీ లోని స్టార్ హీరోస్ రజనీకాంత్, కమలహాసన్ తో ఈమె హీరోయిన్ గా నటించారు. చాలా తక్కువ సమయంలోనే ఈమె ఒక స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. నదియా స్టార్ హీరోయిన్ స్థాయిలో ఉన్నప్పుడు 1988 వ సంవత్సరంలో శిరీష గౌడ్ బోలె అనే ప్రముఖ పారిశ్రామిక వేత్తను ఈమె పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఈమె అమెరికాలో స్థిరపడ్డారు. ఈమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద అమ్మాయి పేరు సనమ్ మరియు రెండవ కూతురి పేరు జన. నదియా కుటుంబం 2000 సంవత్సరం లో అమెరికా నుండి లండన్ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. 2008 వ సంవత్సరంలో ఇండియాకు తిరిగి వచ్చారు నదియా.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?