కాలం ఎవరితో పని లేకుండా సాగిపోతుంది. కానీ మనిషి జీవితంలో ఎన్నో మార్పులను, మరెన్నో జ్ఞాపకాలను పరిచయం చేస్తూ తనపని తానూ చేసుకుంటూ వెళుతుంటుంది. ఇలాంటి ఎన్నో అనుభవాలనే ఓ అందాల ముద్దుగుమ్మ జీవితంలో తీపి జ్ఞాపకాలుగా నిలుస్తున్నాయి. ఇంతకు ఎవరా సుందరి అని అనుకుంటున్నారా.. అందానికి అందం ఒడ్డు పొడుగు ఉన్న ఆ భామనే రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు 2011 లో కెరటం అనే చిత్రం ద్వారా పరిచయం అయినా.. 2013లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో ప్రేరణ పాత్రలో రకుల్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.
ఇలా కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలతో కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ లోనూ తనకంటూ అవకాశాల్ని సృష్టించుకుంటోంది. మన టాలీవుడ్ విషయానికి వస్తే పండగ చెస్కో, నాన్నకు ప్రేమాతో, రారండోయ్ వేడుక చూద్దాం, స్పైడర్, మన్మదుడు 2 వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకోవడమే కాదు.. బాలీవుడ్ చిత్రాలలో `దే దే ప్యార్ దే, మార్జావాన్, సిమ్లా మిర్చి వంటి తదితర చిత్రాల్లో కూడా నటించింది. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 47 పేరుతో జిమ్ లను నిర్వహిస్తూ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామేతను నిజం చేస్తుంది.
ఇలా తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటు స్టార్ స్టేటస్ చేరుకున్న రకుల్, తన సినీ ప్రయాణంలో మరచిపోలేని అనుభవాలను మూటగట్టుకుందట.. ఇకపోతే తన జీవితంలోకి ఒక్కసారి తొంగి చూసుకుంటే తాను చిత్రపరిశ్రమకు వచ్చి అప్పుడే ఏడేళ్లు గడచిపోయాయని తెలుపుతూ ఈ సందర్భంగా ఏడు సంవత్సరాల క్రితం నుంచి ఇన్నాళ్ల జర్నీకి సంబంధించిన ఫోటో ని తన ఇన్ స్టా లో షేర్ చేసింది ఈ భామ. అంతేకాదు # 7ఇయర్స్ ఆఫ్ TFI అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించి ఎమోషన్ కి గురైంది.
ఇక ప్రస్తుతం రకుల్ టాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది. నాగార్జున తో నటించిన మన్మధుడు సినిమా తర్వాత చిన్న గ్యాప్ వచ్చినప్పటికి అనూహ్యంగా ఇద్దరు యంగ్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకొని క్రిష్ – వైష్ణవ్ తేజ్ సినిమా అలాగే నితిన్ – చంద్ర శేఖర్ యేలేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలలో నటించే అవకాశం అందుకుంది. వీటితో పాటు మరికొన్ని తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట.