Renu Desai: దేశంలో కరోనా థర్డ్ వేర్ విజృంభిస్తొంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు పెడుతున్నారు. జాగ్రత్తలు పాటిస్తున్నా అనేక మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. సామాన్యులు మొదలు కొని కేంద్ర మంత్రులు, ప్రజా ప్రజాప్రతినిధులు, సినీ సెలబ్రిటీలను కరోనా ఆందోళనకు గురి చేస్తోంది. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో సహా అనేక మంది సినీ సెలబ్రిటీలు కరోనా సోకడంతో హోం కోరంటైన్ అయ్యారు.
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి దర్శకురాలు రేణు దేశాయ్, కుమారుడు అకీరా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఇప్పటికే రెండు డోసులు వాక్సిన్ చేయించుకున్నా మళ్లీ కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. సరిగ్గా అకీరాకు వాక్సిన్ వేయిద్దాం అనుకునేలోపు రిపోర్టు పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని మాస్క్ లు ధరించాలని సూచించారు రేణుదేశాయ్.
“అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే ఉన్నప్పటికీ నేను, అకరా కరోనా బారిన పడ్డాం. కొన్ని రోజుల క్రితం లక్షణాలు కనిపించగా పరీక్షలు చేస్తే కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మేం కోలుకుంటున్నాం. నేను ఇది వరకే రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నా నాకు కరోనా సోకింది. అకీరాకి వ్యాక్సిన్ వేయిద్దాం అనుకునే లోపే అతడికి కూడా కరోనా వచ్చింది. ఈ థర్డ్ వేవ్ ను చాలా సీరియస్ గా తీసుకోండి. మాస్కులు దరించండి. జాగ్రత్తగా ఉండండి” అంటూ రేణు దేశాయ్ పేర్కొన్నారు.
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…