ఈ సినిమాల విషయం అలా ఉంచితే సీరియల్స్ లో చేసే నటీ నటులు కొన్ని సందర్భాలలో బయట కూడా అలాగే రియాక్ట్ అవుతుంటారు. సంవత్సరాల తరబడి సీరియల్స్ లో ఒకే పాత్రలో ఇమిడిపోయి ఆ పాత్ర తాలూకా స్వభావం నిజ జీవితంలో పడుతుంది. అందుకు ఇటీవల జరిగిన సంఘటననే ఒక ఉదాహరణ అంటున్నారు.
తాజాగా వదినమ్మ సీరియల్ నటి శివ పార్వతి తనకు కరోనా వచ్చిందని.. ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఒక వీడియో ద్వారా తెలిపింది. ముఖ్యంగా ఆవిడ నటిస్తున్న వదినమ్మ సీరియల్ యూనిట్ తనని పట్టించుకోలేదని.. కనీసం తన ఇన్సూరెన్స్ క్లైమ్ విషయం గురించి కూడా మాట్లాడలేదని.. తనకు కరోనా రావడం వల్ల ఎవరి మనస్తత్వం ఏంటో తెలిసిందంటూ ఆవేదన చెందారు.
ఈ క్రమంలో తన పరిస్థితి తెలుసుకున్న జీవిత, రాజశేఖర్లు స్పందించి తనకు వైద్యం అందేలా చేశారని .. నేను ఎలా ఉన్నాను.. ఏ హాస్పటల్లో ఉన్నాను.. నా పరిస్థితి ఎలా ఉంది అని వదినమ్మ యూనిట్ పరామర్శించకపోవడం దురదృష్టమని వీడియోలో తెలిపారు శివ పార్వతి.
అయితే శివ పార్వతి విడుదల చేసిన వీడియోపై వదినమ్మ సీరియల్ నటుడు ప్రభాకర్ స్పందిస్తూ.. చిన్న మిస్ అండర్ స్టాడింగ్ వల్లే ఇది జరిగిందని.. తప్పకుండా శివ పార్వతిని ఆదుకుంటామంటూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అదే వీడియోలో శివ పార్వతి కావాలని ఆ వీడియోను షేర్ చేయలేదని చిన్న మిస్టేక్ వల్ల ఆ వీడియో బయటకు వచ్చిందని తనతో చెప్పినట్టు తెలిపాడు.
అయితే ఈ విషయంలో శివ పార్వతి.. నేను బాగానే ఉన్నానని, నాకు ఎవరి సానుభూతి అవసరం లేదంటూ మరో వీడియో విడుదల చేశారు. తాజా వీడియోలో శివ పార్వతి మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా యూట్యూబ్ ఛానల్స్లో నా వీడియో చూసి చాలా మంది స్పందించారు.. వారికి చాలా ధన్యవాదాలు. నేను కరోనా నుంచి కోలుకున్నాను.. ఇంకా కోలుకోవాలి.. ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది. ఇంకొన్నాళ్ళు ట్రీట్ మెంట్ తీసుకోవాలి. ప్రస్తుతం నేను ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందుల్ని ఎదురోవటం లేదని తెలిపారు.
అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడూ నాకు అండగా ఉన్నారు.. పరుచూరి బ్రదర్స్ ఎప్పుడూ నాకు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. నేను ప్రస్తుతం వర్క్ చేసిన ప్రొడక్షన్స్ (వదినమ్మ సీరియల్ టీం) నుంచి స్పందన లేదని ఒక పర్సనల్ వీడియోను షేర్ చేస్తే.. అది యూట్యూబ్లో పెట్టేశారు. ఇందులో ఎవరూ ఎవర్నీ విమర్శించాల్సిన పనిలేదు. ఎవరో హర్ట్ అవ్వాలని నేను వీడియో పెట్టలేదని అన్నారు. నన్ను పరామర్శించలేదని కాస్త ఫీలయ్యాను అంతే అంటూ సింపుల్ గా తేల్చేశారు. మొత్తానికి ఈ ట్విస్ట్ చాలా మందికి షాకిచ్చింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?