Actress Trisha: టాలివుడ్ ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. కరోనా సెకండ్ వేవ్ లోనూ చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. అనేక మంది ప్రముఖులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. అయితే సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడితే షూటింగ్ లు నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో సినీ ఇండస్ట్రీ కరోనా పట్ల తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇప్పటికే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మంచు లక్ష్మి, విశ్వక్ సేన్ తదితరులు కరోనా బారిన పడగా తాజాగా ప్రముఖ సినీనటి త్రిష కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఇలా వరుసగా సెలబ్రిటీలు కరోనా బారిన పడటం ఇండస్ట్రీని ఆందోళనకు గురి చేస్తోంది. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు త్రిష తెలియజేశారు. తనతో కాంటాక్ట్ అయిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నట్లు త్రిష తెలిపారు.
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 2వేలకుపైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యియి. గత 24 గంటల్లో 64,474 మందికి పరీక్షలు నిర్వహించగా 2,295 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.