Actress Urmila: దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందంటూ కొందరు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో కూడా కరోనా మహమ్మారి మళ్లీ ఆందోళన కల్గిస్తోంది. యువ నటి ప్రగ్యా జైశ్వాల్ కి ఇటీవలే రెండవ సారి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలాన్ని రేపింది. తాజాగా నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు.
Read More: Rajinikanth: పూర్తిగా కోలుకున్న తలైవా..ఆసుపత్రి నుండి ఇంటికి..
Actress Urmila: హోం క్వారంటైన్ లో నటి ఊర్మిళ
తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పేర్కొన్న ఊర్మిళ ..ప్రస్తుతం తాను బాగానే ఉన్నాననీ, హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. గత 15 రోజులుగా తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఊర్మిళ సూచించారు. దీపావళి సంబరాలను అన్ని జాగ్రత్తలను పాటిస్తూ జరుపుకోవాలని కోరారు. ఊర్మిళ 2016లో తన ప్రియుడు మోహసిస్ అఖ్తర్ ను వివాహమాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద ముంబాయి నార్త్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తరువాత ఆమె శివసేన పార్టీలో చేరారు. తెలుగు, మళయాళం, మరాఠీ మరియు తమిళ సినిమాల్లో ఊర్మిళ నటిస్తున్నారు.
Read More: Pawan Kalyan: ఏపి పార్లమెంట్ సభ్యులపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు..
దేశ వ్యాప్తంగా తగ్గుతున్న కేసులు
ఇక దేశంలో కరోనా వ్యాప్తి విషయానికి వస్తే కొద్ది రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు 20వేలకు తక్కువగా నమోదు అవుతున్నాయి. తాజాగా 8,81,379 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 12,514 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. గడచిన 24 గంటల్లో 251 మంది కరోనాతో మృతి చెందారు. గత ఏడాది ప్రారంభం నుండి 3.42 కోట్ల మంది కరోనా బారినపడగా అందులో 3.36 కోట్ల మంది మహమ్మారిని జయించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,58,817 ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతోంది. దేశ వ్యాప్తంగా మొత్తం వ్యాక్సిన్ పంపిణీ అయిన డోసుల సంఖ్య 106 కోట్ల మార్కు దాటింది.