ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన కరోనా కారణంగా అందరి జీవితాలు స్దంభించిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చాలా చోట్ల కరోనా తగ్గుముఖం పట్టగా ఇప్పుడిప్పుడే పరిస్దితులు చక్కదిద్దుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఇంత కాలం ఇంటికే పరిమితం అయిన సెలబ్రెటీలు యథావిధిగా మళ్లీ బిజీ అవుతున్నారు. అంతే కాకుండా కరోనా వైరస్ కారణంగా దాదాపు ఆరు నెలల పాటు పూర్తిగా ఇంటిలోనే కాలాన్ని గడిపిన వీరికి స్వేచ్చ వచ్చినట్లుగా ఫీలవుతూ విదేశీ ప్రయాణాలపై ఆసక్తి చూపిస్తున్నారట.
ఇలాంటి వారిలో అన్నిరంగాలకు చెందిన ప్రముఖులే గాక ముఖ్యంగా స్టార్స్ కూడా ఉన్నారట. ఇకపోతే ప్రస్తుతం యూరప్ దేశాలు కరోనాతో వణికి పోతున్నాయి. కనుక దుబాయ్ తో పాటూగా, మాల్దీవులకు ఈ సెలబ్రెటీలు అంతా క్యూ కడుతున్నారు. అదీగాక ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు మాల్దీవులకు వెళ్లి ఫొటోలను షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల అదాశర్మ కూడా ఒక వీడియోతో పాటుగా కొన్ని ఫొటోలను షేర్ చేయడంతో, అందరిలా ఈమె కూడా మాల్దీవులకు వెళ్లిందా అని అనుకుంటున్నారట. అయితే వారి అనుమానాలకు సమాధానంగా తాను మాల్దీవులకు వెళ్లలేదని షూటింగ్ లో భాగంగా మహారాజాపురంలో ఉన్నాను అంటూ చెప్పడమే కాకుండా తాను మాల్దీవుల బ్యాచ్ కాదు అంటూ ఇండైరెక్ట్ గా కౌంటర్ వేసింది.
మరి ఆదాశర్మ మాటల్లో దాగిన రహస్యం ఏంటని నెటిజన్స్ ఆలోచిస్తుండగా ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్… సమంత ని ఉద్దేశించి అన్నట్టుగా తోచిందట. ఇకపోతే కొత్త జంట కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు మాల్దీవుల్లో హనీమూన్ని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా తాజాగా హీరోయిన్ సమంత కూడా వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. ఇలాంటి సమయంలో ఆదాశర్మ కామెంట్స్ వీరిద్దరిని ఉద్దేశించి అన్నవే అని నెటిజన్స్ ఫిక్స్ అయ్యారట.