భారత పారిశ్రామిక వేత్త గౌతం ఆదానీ దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ తన వ్యాాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని పలు పోర్టులతో సహా దేశంలోని చాలా నౌకాశ్రయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతం ఆదానీ ఇజ్రాయిల్ లోని ఓ నౌకాశ్రయాన్ని తన హస్తగతం చేసుకున్నారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా గురువారం రాత్రి ఈ విషయాన్ని ప్రకటించారు.
ఇజ్రాయిల్ లోని హైఫా పోర్టు ప్రవైటీకరణ టెండర్ ను దక్కించుకున్నట్లు గౌతం అదానీ ప్రకటించారు. ఇజ్రాయిల్ కు చెందిన మరో కీలక సంస్థ గాడోట్ తో కలిసి ఈ టెండర్ ను దక్కించుకున్నట్లు ఆదానీ వెల్లడించారు. ఈ టెండర్ తమకు దక్కడం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు ఆదానీ. ఈ టెంటర్ ద్వారా ఇజ్రాయిల్ – భారత్ మధ్య మరింత స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని గౌతం ఆదానీ అన్నారు.