తెలుగు సినిమాల్లో కొత్తదనం కోసం ట్రై చేసే హీరోల్లో అడివి శేష్ ఒకరని చెప్పవచ్చూ. అందుకు ఉదాహరణగా క్షణం, గూఢాచారి, ఎవరు వంటి చిత్రాలు. అంతేకాకుండా అడివి శేష్ హాలీవుడ్ లెవెల్లో మన కథలను తెరకెక్కిస్తున్నాడు అన్న పేరును సంపాదించాడు. అందువల్ల అడివి శేష్ మీద ప్రేక్షకులకు ఓ రేంజ్లో అంచనాలున్నాయి. ఇక అడివి శేష్ నుండి సినిమా వస్తుందంటే అందులో ఏదో ఒక కొత్త పాయింట్, కొత్త కాన్సెప్ట్ ఉంటుందని.. ఉండాలని ఆశించే వారు లేకపోలేరు. కాగా ప్రస్తుతం అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం మేజర్. ఈ మూవీని మహేష్ బాబు తన జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు. కాగా ముంబై బాంబ్ బ్లాస్ట్లో వీర మరణం పొందించిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు శశి కిరణ్ తెరకెక్కిస్తున్నాడు.
అయితే ఈ చిత్రాన్ని మహేష్ బాబు నిర్మిస్తుండటం ఇక్కడున్న విశేషం. ఒకవేళ మహేష్ బాబు సినిమా తీయాలనుకుంటే ఓరేంజ్ మార్కెట్ ఉన్న హీరోలు లైన్లోకి వస్తారు. మరి ఈ ప్రిన్స్ ఏరికోరి అడివి శేష్ తోనే సినిమాను ఎందుకు ప్లాన్ చేశారనే ప్రశ్న కొందరి మనసును తొలిచేస్తుందట. ఇదంతా పక్కన పెడితే అడివి శేష్ తన సినీ ప్రయాణంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటుడని చెప్పవచ్చూ. అదీగాక విభిన్నమైన కథలను, విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్న ఈ యువ హీరో ఏ పాత్ర పోషించినా తెరపై ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది.
బహుశా ఇలాంటి కొన్ని క్వాలిటీస్ మహేష్ బాబుకు నచ్చడం వల్లే కావచ్చూ తాను నిర్మించే చిత్రంలో శేష్ ను హీరోగా ఎన్నుకున్నాడు అనిపిస్తుంది.
ఇకపోతే అడవి శేష్ ఇదివరకు చేసిన సినిమాలు ఒకెత్తు అయితే ప్రస్తుతం నటిస్తున్న ‘మేజర్’ చిత్రం మరో ఎత్తు. ఎందుకంటే ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్’ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం కాబట్టి.. ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగాయి. అదీగాక ఈ సినిమాకి మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడంటే కథలో మంచి దమ్ము ఉంటుందనే విషయం అర్థమవుతూనే ఉంది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి అడవిశేష్ పోస్టర్ రిలీజై సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.