Adavi sesh : అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా మేజర్. సోనీ పిక్చర్స్ సమర్పణలో మహేష్ బాబు(జీఎంబీ ఎంటర్టైన్మెంట్) మరియు ఏ+ఎస్ మూవీస్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్, తెలుగమ్మాయి శోబిత ధూళిపాళ్ళ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది.
ఈ క్రమంలో మేజర్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ నెల 28న ముంబైలో ‘మేజర్’ సినిమా టీజర్ ని లాంచ్ చేయాలనుకున్నారు. అయితే ఊహించని విధంగా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న శశి కిరణ్ తిక్క కుటుంబంలో జరిగిన ఓ విషాద సంఘటన కారణంగానూ దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుతున్నందు వల్ల టీజర్ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించారు.
Adavi sesh : మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ కావడంతో ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
తాజాగా అడవి శేష్ ట్వీట్ చేస్తూ.. నేషనల్ సినిమా కోసం గ్రాండ్ గా నేషనల్ ఈవెంట్ జరిపేందుకు ప్లాన్ చేశామని అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని.. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అప్ డేట్ ను తెలియజేస్తానని ట్వీట్ లో తెలిపారు. ఇక ఈ సినిమాని సమ్మర్ లో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ కావడంతో ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. చూడాలి మరి మేజర్ ఎలాంటి సక్సస్ ని సాధిస్తుందో.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!