Adavi shesh: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ ఓ సినిమా చేస్తున్నాడంటే ఆ అంచనాలు అందరిలోనూ బాగానే నెలకొంటున్నాయి. క్షణం సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న అడవిశేష్ ఆ తర్వాత గూఢా చారి, ఎవరు సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. సినిమాలలో హీరోగా మాత్రమే కాదు శేష్కు 24 విభాగాల మీద మంచి పట్టుంది. కథ కథనాల మీద స్క్రీన్ ప్లే మీద బాగా గ్రిప్ ఉంది. దాంతో సినిమాకు మంచి ప్లస్ అవుతున్నాడు. సినిమాకు సంబంధించిన అన్నీ విషయాలు పక్కాగా సెట్ చేసుకున్న తర్వాతే సెట్స్ మీదకు వచ్చి సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు.
ప్రస్తుతం మేజర్ సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లేను అడవి శేష్ అందించాడు. గూఢాచారి దర్శకుడు శశి కిరణ్ తిక్క దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ స్టూడియోస్తో కలిపి భారీ బడ్జెట్తో పాన్ ఇండియన్ సినిమాగా నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్గా తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ళ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా 26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ ఆధారంగా రూపొందుతోంది.
Adavi shesh: ఫస్ట్ గ్లింప్స్ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
కాగా, తాజాగా మరో సినిమాను చేస్తున్నట్టు అడవిశేష్ ప్రకటించాడు. విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమా సీక్వెల్లో అడవి శేష్ నటిస్తున్నాడు. హిట్ ది సెకండ్ కేస్ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. అలాగే దీనికి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాను ‘వాల్ పోస్టర్ సినిమా’ పతాకంపై హీరో నేచురల్ స్టార్ నాని సమర్పిస్తుండగా, ప్రశాంత్ తిపిర్నేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?