Adi purush : భారతదేశంలో ఎన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చినా… మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్టులు వచ్చిననా… ప్రతి దర్శకుడికి రామాయణం, మహాభారతం కథలను సిల్వర్ స్క్రీన్ పైన తెరకెక్కించడం అనేది డ్రీమ్ ప్రాజెక్ట్ లే. ఈ మహాకావ్యాలను అందమైన దృశ్యాలతో అద్భుతమైన రీతిలో అధునాతన టెక్నికల్ వాల్యూస్ తో చేయడం అనేది సాధారణ విషయం కాదు. ఎంతో సాహసంతో తీయాల్సిన ఇలాంటి సినిమాలను ఈతరం దర్శకులు చేసేందుకు రెడీ అయ్యారు.
రామాయణం నేపథ్యంలో ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నాడు. చాలా కాలం తర్వాత రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం విశేషం. మరోవైపు బాలీవుడ్ స్టార్ దర్శకుడు మధు మంతెన రామాయణం ౩డి అనే సినిమాను చేసినట్లు ప్రకటించారు. రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టైలిష్ యాక్టర్ హృతిక్ రోషన్ చేస్తుండగా సీత పాత్రలో దీపికా పదుకొనే నటించనుంది.
ఆదిపురుష్ కి పోటీగా ఈ సినిమాను ఇప్పటికే అందరూ భావిస్తున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి రాముడి పాత్ర ఎవరు చేస్తారు అన్న విషయంపై ఎవరికీ ఐడియా లేదు కానీ తాజాగా దర్శకుడు మధు మంతెన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబును ఈ సినిమాలో రాముడిగా నటించమని అడిగినట్లు సమాచారం.
ఈ విషయంపై ప్రముఖ మూవీ రైటర్ సుమిత్ కడెల్ ట్విట్టర్లో ప్రస్తావించారు. ఇక మహేష్ బాబు డీసెంట్ లుక్స్ ఈ పాత్రకు జీవం పోస్తాయన్న ఉద్దేశంతో ఈ పాత్ర అతని దగ్గరికి వెళ్లినట్లు సమాచారం. ఇక ఒకవైపు ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో రాముడిగా కనిపిస్తుంటే మహేష్ బాబు ఇంకొక బాలీవుడ్ సినిమాలో అదే పాత్రలో కనిపించడం అనేది ఒక రకంగా ఆదిపురుష్ టీమ్ కి షాక్ అనే చెప్పాలి.
ప్రభాస్ స్టార్ గా పాన్ ఇండియా స్టార్ గా బాహుబలి తర్వాతే ఎదిగాడు. అయితే మహేష్ కు దేశవ్యాప్తంగా ఎప్పటినుండో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు ఒకే పాత్ర పోషించడం అనేది ఆదిపురుష్ లాంటి సినిమాకు కొంచెం క్లిష్టమైన పరిస్థితిని తెచ్చిపెట్టింది అనే చెప్పాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?