Adipurush: ‘ఆదిపురుష్’..బాలీవుడ్లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న స్ట్రైట్ సినిమా. సాహో తర్వాత నుంచి ప్రభాస్కి బాలీవుడ్లో స్ట్రైట్ సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ ప్రభాస్ ఎందుకో ఒప్పుకోలేదు. జిల్ ఫేం రాధాకృష్ణతో రాధే శ్యాం కమిటయ్యాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా సలార్ సినిమాను కమిటయ్యాడు. అదే వరుసలో బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతిహాసంలోని గాధ ఆధారంగా ఆదిపురుష్ రూపొందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ఆగష్టు అప్డేట్ వచ్చింది. ఇటీవలే ప్రభాస్ రాధే శ్యాం సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ఫైనల్ షెడ్యూల్ పూర్తి చేశాడు. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా సాగుతోంది. శృతి హాసన్ ఇందులో హీరోయిన్. ఇటీవల ఆమెకి సంబంధించిన కీలక సన్నివేశాలను కూడా పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ ఈనెలలో ముగుస్తుందట. దాంతో ప్రభాస్ గ్యాప్ తీసుకోకుండా బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదుపురుష్లో జాయిన్ కానున్నాడట.
Adipurush: ప్రభాస్ – కృతిసనన్ మీద మేజర్ సీన్స్ తెరకెక్కించనున్నారు.
ఆదిపురుష్ కోసం ముంబైలో వేసిన భారీ సెట్స్లో జరుగుతోంది. కాగా ఈనెలలో ప్రభాస్ – కృతి సనన్లమీద కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారట. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యం అయింది. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ నెలలో విడుదల చేస్తామని ముందే చిత్ర బృందం ప్రకటించింది. ఆ డేట్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదని మేకర్స్ ఎంతో పట్టుదలగా సినిమాను పూర్తి చేస్తున్నారు. ఇక ఈ నెలలో ప్రభాస్ – కృతిసనన్ మీద మేజర్ సీన్స్ తెరకెక్కించనున్నారు. ఇప్పటికే రాధే శ్యాం 2022 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. స్లార్ కూడా ఏప్రిల్ లో రానుంది. అంటే 2022లో ప్రభాస్ నుంచి 3 పాన్ ఇండియన్ సినిమాలు రాబోతున్నాయి.