అమరావతి, జనవరి8: ప్రముఖ సినీ నటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ విషయంపైన ఆయన వైసిపి అధినేత వైఎస్ జగన్కు మంగళవారం లేఖ రాశారు.
వైసిపి తరపున తెనాలిలో పోటీ చేయాలని ఆయన భావించగా పార్టీ విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని సూచించింది. ఈ విషయంలో పార్టీ నిర్ణయంతో విబేధించి ఆయన పార్టీ వీడినట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత ఆదిశేషగిరిరావు టిడిపి తీర్ధం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ ప్రస్తుతం గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడుగా వ్యవహరిస్తున్నారు.