టాలెంటెడ్ హీరోయిన్స్ ఎవరూ అని వెతికి వేళ్ళ మీద లెక్కపెడితే వాళ్ళలో అదితి రావు హైదరీ తప్పకుండా ఉంటుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలలో నటించిన అదితి మణిరత్నం తెరకెక్కించిన సినిమాతో కోలీవుడ్ లోను అడుగుపెట్టింది. గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్ రోల్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న అదితి కి సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో అవకాశాలు భాగానే వస్తున్నాయి.
టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైంది. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం సినిమాలో హీరోయిన్ గా నటించింది. కాని ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. దాంతో ఇక ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు రావని అందరూ భావించారు.
అయితే అనూహ్యంగా మరోసారి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోనే వి సినిమాలో నటించింది. నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన ఈ సినిమాలో నివేదా థామస్ తో పాటు కలిసి నటించింది. నాని కి జంటగా నటించిన అదితి స్క్రీన్ మీద కనిపించింది కొంచం సేపైనా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోకపోవడంతో టాలీవుడ్ లో అదితి రావు హైదరీ కి ఇదే లాస్ట్ సినిమా అని మళ్ళీ మాట్లాడుకున్నారు.
కాని ఈ బ్యూటీకి మళ్ళీ లక్కీగా పెద్ద బ్యానర్ నుంచి అవకాశం దక్కించుకుంది. ఎప్పటి నుంచో ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి మహాసముద్రం అన్న సినిమా కోసం విశ్వ ప్రయత్నాలు చేసి ఎట్టకేలకి ఏ.కే.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా తెరకెక్కించే అవకాశం అందుకున్నాడు. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ కి జంటగా అదితి ని ఫైనల్ చేసుకొని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.
అయితే అదితి నటించిన సినిమాలు ఫ్లాపవుతున్నా కూడా తనకి అవకాశాలు వస్తున్నాయంటే తన టాలెంట్ ఏంటో మేకర్స్ బాగా అర్థం చేసుకున్నారు కాబట్టే తనకి వరసగా అవకాశాలిస్తున్నారని చెప్పుకుంటున్నారు. నిజంగా ఇలాంటి టాలెంట్ ఉన్న హీరోయిన్ కి మంచి అవకాశాలు దక్కితే ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అవడం ఖాయం.