ఢిల్లీ, జనవరి 26: అగస్టా వెస్ట్లాండ్ వివిఐపి ఛాపర్ల కేసులో న్యాయవాది గౌతమ్ ఖైతాన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. నల్లధనం, దివాలా చట్టం కింద ఆయన్ను అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. గౌతమ్ ఖైతాన్కు చెందిన కార్యాలయాల్లో గత వారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. అనేక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నల్లధనం చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. దుబాయ్, మార్షియస్, సింగపూర్, తునిసియా, స్విడ్జల్యాండ్, యుకె దేశాల్లో గౌతమ్ ఖైతాన్కు అక్రమంగా బ్యాంకు ఖాతాలు ఉండగా..వాటిలో కోట్ల రూపాయలు నల్లధనం దాచి ఉంచినట్లు అధికారులు గుర్తించారు.
గౌతమ్ ఖైతాన్ను అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణం కేసులో 2014 సెప్టెంబర్లో అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనపై చార్జిషీట్ దాఖలైంది. ఈ కేసులో ఆయన 2015 జనవరిలో బెయిల్పై విడుదల అవ్వగా, మరల 2016 డిసెంబర్ తొమ్మిదవ తేదీన సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. తరువాత బెయిల్పై విడుదల అయ్యాడు.
ఆయన్ను రెండు పర్యాయాలు సిబిఐ అధికారులు అరెస్టు చేయగా, నేడు ఇడి అధికారులు అరెస్టు చేశారు.