అమరావతి: అమరావతి నుండి హైకోర్టును కర్నూలుకు తరలించవద్దంటూ విజయనగరం న్యాయవాదులు గురువారం నిరసనకు దిగారు. హైకోర్టు తరలింపు వల్ల ప్రజలు, న్యాయవాదులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. అమరావతిలోనే హైకోర్టు కొనసాగించాలనీ, లేకుంటే విశాఖలో పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో రాజధానిపై చర్చలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానులంటూ కొత్త ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. పరిపాలనా రాజధానిగా విశాఖ, న్యాయనగరంగా కర్నూరు, శాసనసభ, శాసనమండలితో చట్టసభల రాజధానిగా అమరావతి ఉండవచ్చని జగన్ ప్రకటించారు.
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతాంగం పెద్ద ఎత్తున నిరసనలు, దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే.