జిఎస్టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) గురించి తెలియని వ్యక్తి ఉండడు ఏమో. భారతదేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల బదులు వస్తువులు సేవల తయారీ, అమ్మకం, వినియోగాలపై విధిస్తున్న సమగ్రమైన పరోక్ష పన్ను. ఈ పన్ను (జిఎస్టి) ద్వారా అక్టోబర్ నెలలో 1.05 లక్షల కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత తొలిసారిగా 1 లక్షల కోట్ల మార్కును దాటిందని, అక్టోబర్లో వసూలు చేసిన స్థూల జీఎస్టీ ఆదాయం 1,05,155 కోట్లు అని ప్రభుత్వం వెల్లడించింది.
అందులో కేంద్ర వస్తువులు, సేవా పన్ను (సిజిఎస్టి)-19,193 కోట్లు, రాష్ట్ర వస్తు సేవా పన్ను (ఎస్జిఎస్టి)-4 25,411 కోట్లు, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (ఐజిఎస్టి) ₹ 52,540 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన- 3 23,375 కోట్లు) మరియు సెస్- 8,011 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన 22 932 కోట్లతో సహా) ఆదాయం వచ్చింది అనే విషయాన్ని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
సెప్టెంబర్ నెలలో జిఎస్టి వసూలు 4 95,480 కోట్లు. అక్టోబర్ నెలలో దాఖలు చేసిన జిఎస్టిఆర్ -3 బి రిటర్న్ల సంఖ్య 80 లక్షలు. గత ఏడాది ఇదే నెలలో 95,379 కోట్ల రూపాయలతో పోలిస్తే 2020 అక్టోబర్ ఆదాయం 10 శాతం ఎక్కువ. ఈ నెలలో వస్తువుల దిగుమతి ద్వారా వచ్చే ఆదాయం 9 శాతం, దేశీయ లావాదేవీల ద్వారా (సేవల దిగుమతితో సహా) ఆదాయం 11 శాతం అధికంగా ఉంది.
ఇక ఏపీ నుంచి రూ.2480 కోట్లు, తెలంగాణ నుంచి రూ.3,383 కోట్ల జీఎస్టీ వసూలైంది. గత ఏడాదితో పోల్చితే ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 26 శాతం నమోదు కాగా. తెలంగాణలో 5 శాతం నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
గత ఆర్ధిక సంవత్సరం ఫిబ్రవరిలో లక్ష కోట్లు జిఎస్టీ వసూలు అయింది. తర్వాత కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా కంపెనీలు చాలావరకు మూతపడ్డాయి. వ్యాపారాలు పడిపోయియి, దీనితో ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.