పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇప్పటి వరకు చేయని ఒక కొత్త కాన్సెప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో చేస్తున్న పీరియాడిక్ సినిమా. ప్రస్తుతం కమిటయిన నాలుగు సినిమాలలో ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ కి చాలా ప్రత్యేకమని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. పవన్ కెరీర్ లోనే ఇప్పటి వరకు టచ్ చెయ్యని జానర్ కావడం, మరీ ముఖ్యంగా ఈ సినిమాకి క్రిష్ దర్శకుడు కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమాకి పర్ఫెక్ట్ టైటిల్ ఏంటన్నది క్లారిటీ రావడం లేదు. ఒకే ఒక్క షెడ్యూల్.. అది కూడా 15 రోజులు మాత్రమే చిత్రీకరణ జరిపినట్టు సమాచారం. అందులో కూడా పవన్ కళ్యాణ్ లేని సీన్స్ నే చిత్రీకరించాడట దర్శకుడు క్రిష్. అయినా ఈ సినిమా మీద విపరీతమైన క్రేజ్ నెలకొంది. ప్రతిష్టాత్మకంగా శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మించడం కూడా సినిమాకి క్రేజ్ వచ్చింది.
ఇక ఇప్పటికే కొన్ని టైటిల్స్ పరిశీలిస్తున్నారని గత కొన్ని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కథా నేపథ్యం.. అందులో పవన్ కళ్యాణ్ పాత్ర దృష్ఠ్య ఈ సినిమాకి “బందిపోటు”, “విరూపాక్ష”, “గజదొంగ” అన్న టైటిల్స్ వినిపించాయి. అంతేకాదు లేటెస్ట్ గా “ఓం శివమ్” పేరు కూడా ప్రచారంలో నిలిచింది. కాగా తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అదే “అంతర్వాహిని”.
ఈ సినిమాకి మాటలు అందిస్తున్న సాయి మాధవ్ బుర్ర కొన్ని అద్భుతమైన వాఖ్యలతో ‘అంతర్వాహిని’ పేరిట తెలిపారు. ఇపుడు అదే హెడ్ లైన్ క్రిష్ కూడా హైలైట్ చెయ్యడం అటు పవన్ అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఇదే టైటిల్ ఫైనల్ చేయాలా లేక “ఓం శివమ్” టైటిల్ ఫైనల్ చేయాలా అన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి అభిమానులకి ఏది నచ్చితే అదే టైటిల్ ఫిక్స్ అవుతుందని అర్థమవుతుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?