Brush: ప్రతి రోజు అందరం లేవగానే బ్రష్ చేస్తూ ఉంటాము.. కొంత మంది బ్రష్ చేయడం త్వరగా ముగిస్తారు.. మరి కొంత మంది ఎక్కువ సమయం తీసుకుంటారు.. అయితే ఎంత సమయం తీసుకున్న పళ్ళు శుభ్రంగా ఉంచుకోవటం ముఖ్యం.. కానీ బ్రష్ చేసిన తర్వాత ఈ పని చేయవద్దని దంత నిపుణులు చెబుతున్నారు.. మరి ఆ పని ఏమిటంటే..!?
Brush: పళ్ళు తోముకున్న తర్వాత మౌత్ వాష్ ఉపయోగిస్తున్నారా..!?
చాలా బ్రష్ చేసిన తర్వాత నోరు ఫ్రెష్ గా ఉండటానికి వెంటనే మౌత్ వాష్ చేస్తారు.. ఇది ఏం మంచిది కాదని బ్రష్ చేసిన వెంటనే మౌత్ వాష్ ఉపయోగించకూడదని డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు మీకు ఉంటే వెంటనే మానుకోమని లండన్ చెందిన దంత వైద్యులు చెబుతున్నారు.. ఎందుకంటే పళ్ళు తోముకున్న తర్వాత మౌత్ వాష్ నీటిని నోటిలో పోసుకొని పుకిల్లిస్తే.. దంతల్లోని జీవ కణాజలం కుళ్లిపోయి దంత క్షయం ఏర్పడుతుంది. అందువలన ఈ అలవాటు ఉన్నవారు మార్చుకుంటే సరిపోతుంది.
సాధారణంగా మౌత్ ఫ్రెష్ దంత క్షయం నుంచి రక్షిస్తుంది. కానీ పళ్ళు తోముకున్న తరవాత మాత్రం వద్దని డెంటిస్తులు సూచిస్తున్నారు.. ఇది పంటిపై ఉండే ఎనామిల్ ను తొలగిస్తుంది. ఇలా చేయడం వలన మీ దంతాల పై టూత్ పేస్ట్ ఫ్లోరైడ్ మొత్తం పోతుంది. అలా అని మౌత్ వాష్ లో ఉండే ఫ్లోరైడ్ రోజంతా వచ్చే క్రిములతో పోరాడలేదు. అందుకని పళ్ళు తోముకున్న వెంటనే మౌత్ వాష్ ఉపయోగించండి. మధ్యాహ్నం భోజనం తర్వాత మౌత్ వాష్ చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అప్పటి నుంచి రాత్రి వరకు క్రిముల తో పోరాడే శక్తి సరిపోతుంది.