Balakrishna: నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిన తర్వాత రాయలసీమ ప్రాంతంలో భారీ సన్నివేశాలు చిత్రీకరించిన బోయపాటి తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ తమిళనాడులో చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇటీవలే క్లైమాక్స్ షెడ్యూల్ ఖరారు కావడంతో సినిమా యూనిట్ మొత్తం ఇప్పుడు చెన్నైలో హడావిడి చేస్తూ ఉంది. త్వరలోనే బాలయ్య బాబు ఉ యాక్షన్ సన్నివేశాలలో రంగంలోకి దిగి పోతున్నట్లు సినిమాకి హైలెట్ ఫైట్ అన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఈ షెడ్యూల్ తో పాటు మరొక సాంగ్ మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు కుదిరితే దసరా లేదంటే బాలయ్య బాబు లక్కీ సీజన్ సంక్రాంతి పండుగకు అఖండ రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కాగా ఈ సినిమా అయిన వెంటనే తరువాత అనిల్ రావిపూడి తో.. బాలకృష్ణ సినిమా ఉంటుందని మొన్నటిదాకా సరికొత్త టాక్ వినబడింది.
Read More: Akhanda : అఖండ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్..బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్న బాలయ్య
పుట్టిన రోజు నేపథ్యంలో బాలకృష్ణ కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి కంటే ముందుగానే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయాలని బాలయ్య ఫోకస్ పెట్టినట్లు లేటెస్ట్ టాక్. పూరి జగన్నాథ్ సినిమాలు తీయడంలో చాలా స్పీడ్ కావటంతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు గోపీచంద్ మలినేని సినిమా అయిన వెంటనే పూర్తి సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అవసరమైతే గోపీచంద్ మలినేని సినిమా చేస్తూనే మరోపక్క పూర్తి సినిమా కూడా చేయొచ్చు అని టాప్ మరోపక్క వినబడుతుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?