పోలీసులను చూస్తే ఇంకా కొంత మంది జనానికి భయం మాత్రం తగ్గడం లేదు. ఈ భయం ఉండొద్దని పోలీస్ శాఖ కూడా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని తీసుకొచ్చినప్పటికీ.. పోలీసులను చూసినా.. వారి పేరు చెప్పినా కొందరు జంకుతునే ఉన్నారు. దీన్ని క్యాచ్ చేసుకున్న కొంతమంది ఆకతాయిలు పోలీసుల పేర్లతో బెదిరింపులకు,మోసాలకు పాలుపడుతున్నారు. తీరా వాళ్ళు పోలీసులు కాదని తెలిసి అమాయక బాధితులు నాలుకను కరుసుకుంటున్నారు.
ఇలాంటి ఘటనే ఇంకోటి బయటకు వచ్చింది. “పోలీస్ ఆఫీసర్ ను మాట్లాడుతున్నా.. నువ్వు గుండు గీసుకోకపోతే నీ అంతు చూస్తా..” అనగానే బాధితుడు నిజమా కాదా అని ఆలోచించకుండానే గుండు గీయించుకున్నాడు. తీరా పోలీస్ ఆఫీసర్ ఇలా చెప్పాడం ఏంటని స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేయడంతో అది ఫేక్ కాల్ అని తేలింది.
వివరాల్లోకి పోతే.. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. అనకాపల్లికి చెందిన ఒక యువకుడికి నేను పోలీస్ ఆఫీసర్ ను అంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫేస్ బుక్ ఫొటోలో జుట్టు ఎక్కువగా పెరిగింది.. వెంటనే గుండు చేయించుకోపోతే కేసు పెడతానని బెదిరింపునకు దిగాడు. మర్యాదగా గుండు చెయించుకో లేకపోతే నీ అంతు చూస్తా అంటూ హెచ్చరించాడు. దీన్ని నిజమే అనుకున్న బాధితుడు పోలీసుల మీద ఉన్న భయానికి వెళ్లి గుండు కొట్టించుకున్నాడు. తర్వాత ఇదంతా ఏమీ అర్థం కాక ఇదేంటని అనుమాన పడ్డాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిందంతా చెప్పాడు.
బాధితుడికి వచ్చిన కాల్ ఆధారంగా ఆరా తీసిన పోలీసులు అది ఫేక్ కాల్ అని తేల్చి చెప్పేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో విచారణ జరిపితే.. అనకాపల్లి బాధితుడికి కాల్ చేసి గుండు గీయించుకోమంది సంగారెడ్డి జిల్లా సెర్లాపురికి చెందిన పండరిగా గుర్తించారు. అయితే ఎందుకు చేశాడు అనే విషయాలు తెలియాల్సి ఉంది. కానీ మీరు కూడా ఇలా చేసేరు.. కాల్ చేసి ఏ ఆఫీసర్ ఇలా చెప్పారు. అలా చెప్తే ఎవరు ఏంటని కనుకున్నే ప్రయత్నం చేయాలి కానీ భయంతో ఏం చెప్పినా చేయడానికీ సిద్ధం కావొద్దు.