అదితి రావ్ హైదరీ కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. తెలుగు నేపథ్యం అయినప్పటికి ముందుగా బాలీవుడ్ లో అభిషేక్ బచ్చన్ తో ‘ఢిల్లీ 6’ ‘యా శాలి జిందగీ’ ‘రాక్ స్టార్’ ‘కూబ్సూరత్’ ‘వాజిర్’ ‘భూమి’ ‘పద్మావత్’ లాంటి భారీ సినిమాలతో హిందీ చిత్ర సీమలో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా సంజయ్ దత్ హీరోగా నటించిన భూమి సినిమాలో అదితి రావ్ హైదరీ చేసిన పాత్రకి గొప్ప ప్రశంసలు దక్కాయి. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సమ్మోహనం’ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైంది.
అంతేకాదు మణిరత్నం దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో వచ్చిన ‘నవాబ్’ సినిమాతో పాటు ఉదయనిధి స్టాలిన్ – మిస్కిన్ కాంబినేషన్ లో వచ్చిన ‘సైకో’ సినిమాలలో నటించింది. తెలుగు, తమిళం, హిందీ చిత్ర పరిశమలలో అదితి రావ్ హైదరీ హీరోయిన్ గా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఇంద్రగంటి దర్శకత్వంలో నాని – సుధీర్ బాబు లతో కలిసి అదితి రావ్ హైదరీ నటించిన ‘వి’ సినిమాలో రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే అదితి రావ్ హైదరీ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘సూఫీయుమ్ సుజాతయుమ్’.రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ మలయాళ సినిమాలో జయసూర్య నటించాడు.
ఇక ఇప్పటి వరకు మలయాళం నుంచి ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలైన ఫస్ట్ సినిమాగా ‘సూఫీయుమ్ సుజాతయుమ్’ కావడం విశేషం. మూగ అమ్మాయిగా అదితి రావ్ హైదరీ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. గతంలో ‘ప్రజాపతి’ సినిమాతో పరిచయమైన అదితి రావ్ హైదరి మళ్ళీ 14 ఏళ్ళ తర్వాత మలయాళంలో ‘సూఫీయుమ్ సుజాతయుమ్’ లో నటించింది. ఈ నేపథ్యంలో చాలా విషయాల గురించి వెల్లడించింది. సినిమాల సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ గురించి ఒక సినిమాకి సైన్ చేసిన తర్వాత ఆ సినిమా కంప్లీట్ అయ్యే ప్రాసెస్ ని బాగా ఎంజాయ్ చేస్తుంటానని తెలిపింది. ఇక తను నటించిన తెలుగు ‘వి’ ని ఖచ్చితంగా థియోటర్స్ లోనే చూడాలని అంటోంది.