నట సింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బీబీ3. సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి బాలయ్య, బోయపాటి కాంబినేషన్ రిపీటవుతోంది. దాంతో ఈ సినిమా మీద బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకా క్రియోషన్ బ్యానర్ లో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇక బీబీ3 ఫస్ట్ రోర్ నందమూరి అభిమానులని ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే కొంత టాకీ పార్ట్ కంప్లీటయిన ఈ సినిమా మళ్ళీ త్వరలో సెట్స్ మీదకి వెళ్ళేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషించబోతున్నాడని సమాచారం. అలాగే బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ ఈ సినిమాలో బాలయ్య కి విలన్ గా నటించబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. కాని చిత్ర యూనిట్ అధికారకంగా వెల్లడించాల్సి ఉంది.
ఇక ఈ సినిమాకి సంబంధించి రెండు విషయాలలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అందులో ఒకటి ఈ సినిమా టైటిల్ విషయం కాగా.. బాలయ్య సరసన నటించే హీరోయిన్స్ ఎవరన్నది రెండవది. కథ ప్రకారం ఇందులో ఇద్దరు హీరోయిన్ ఉన్నారన్న టాక్ ఉంది. అయితే అమలా పాల్ ని ఒక హీరోయిన్ గా తీసుకున్నారన్న న్యూస్ వచ్చినప్పటికి అధికారకంగా వెల్లడికాలేదు. అలాగే బీబీ3 కి మొనార్క్ ..సూపర్ మ్యాన్, డేంజర్..ఇలా పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పుడు తాజాగా “బొనాంజ” అన్న టైటిల్ ని కూడా చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. మరి అసలు టైటిల్ ఏంటన్నది మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు ఫిక్స్ అవలేము.
ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ..పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఇద్దరి మద్య కథా చర్చలు కూడా జరిగాయని సమాచారం. అలాగే 2021 లో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ని వెండితెరకు పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం మంచి కథ ని సెలెక్ట్ చేసి పెట్టాడట బాలయ్య.