Afternoon Naps: మాములుగా పని ఒత్తిడి వలన అలసి పోయి ఉంటే.. మధ్యాహ్నం సమయంలో అలా కూర్చోగానే మన కళ్లు మూత పడటం మాములు విషయమే. ఇది వేసవిలో మరీ ఎక్కువగా ఉంటుంది. అలాగే తిన్న తరువాత కుర్చీలో కూర్చోగానే కళ్లు ఒక్కసారిగా మూత పడవు. కానీ తినగానే కొద్ది సేపటకి ఒక కునుకు తియడం – Afternoon Naps చాలా మందికి అలవాటే. అలా మధ్యాహ్నం పూట కునుకు తీయడం ఆరోగ్యానికి చాలామంచిదని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవలి ఒక అధ్యయనంలో పరిశోధకులు పేర్కొన్నారు.
ఇలా మధ్యాహ్నం పూట రోజు నిద్రపోవటం వలన మానసిక చురుకుదనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒక ఆన్లైన్ జర్నల్ లో ప్రచురితమైన పరిశోధన వివరాల ప్రకారం.. మనం మధ్యాహ్నం పూట కునుకు అనేది మంచిదని పేర్కొంది. దీని వలన ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు. వయస్సు పెరిగేకొద్దీ ఎంతో మందిలో నిద్ర విధానాలు మారుతుంటయట. వయసు పెరిగిన వారిలో చాలా మంది మధ్యాహ్నం కునుకు తీయాలని చూస్తారట. అయితే డిమెన్షియాను నివారించడానికి ఈ మధ్యాహ్నం కునుకు ఉపయోగపడుతుందా? అలాగే ఈ కునుకు వలన మతిమరుపు వస్తుందా.. అనే దానిపై పరిశోధకులు ఒక అభిప్రాయానికి రాలేదు.
అయితే చైనాలోని పలు పెద్ద నగరాల్లో నివసిస్తూ.. కనీసం 60 ఏళ్ల వయస్సున్న 2,214 మంది ఆరోగ్యవంతులను ఈ పరిశోధనకు పిలిచారు. ఇందులో 1,534 మంది మాములుగా మధ్యాహ్నం పూట కునుకు తీశారు. కానీ 680 మంది అలా చేయలేదు. వీరిలో మతిమరుపును పరిశీలిండానికి మినీ-మెంటల్ స్టేట్ ఎగ్జామ్ తో సహా పలు పరీక్షలు చేశారు. అయితే ఈ రెండు వర్గాల వారిలో రాత్రిపూట నిద్ర సగటు 6.5 గంటలుగా ఉందని తేలింది. అయితే మధ్యాహ్నం 5 నిమిషాల పాటు కునుకు తీసిన వారికి జ్ఞాపకశక్తి పెరిగిందని ఈ పరిశోధన తేల్చింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?