తెలంగాణలో విపరీతంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ సర్కార్ ఇప్పుడు మరోక కీలక అడుగులు వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరొ రెండు మూడు రోజుల్లో అధికారికంగా ఏ విషయం అన్నది ప్రకటిస్తామని కేసీఆర్ తెలపడం జరిగింది. ప్రస్తుతానికైతే తెలంగాణలో ఒక 15 రోజులు పూర్తి లాక్డౌన్ విధించే దిశగా తమ సర్కారు ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు.
అది కాకుండా గత రెండు రోజుల నుండి రాష్ట్రంలో ఏటువంటి టెస్టింగ్ జరగలేదు. ప్రైవేట్ ల్యాబ్ నిర్వహణలో లోపాలవల్ల శాంపిల్స్ స్టాక్ పెరిగిపోయి టెస్టింగ్ లు ఆపేశారు. ఈ నేపథ్యంలో రానున్న పదిరోజుల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉండడంతో నిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక లాక్డౌన్ నుండి మినహాయింపులు తర్వాత సాధారణ జీవితానికి అలవాటు పడిన ప్రజలు మళ్లీ ఈ లాక్ డౌన్ ను ఎలా స్వీకరిస్తారో అన్న విషయంపై సర్వత్రా చర్చ నెలకొంది.