Agnipath protest: అగ్నిపథ్ పధకాన్ని వ్యతిరేకిస్తున్న ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఆందోళన కారులపై రైల్వే ప్రత్యేక పోలీస్ బలగాలు కాల్పులు జరపడంతో వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ అనే ఆర్మీ అభ్యర్థి మృతి చెందగా మరో పది మందికి పైగా గాయపడ్డారు.
ఈ ఘటనపై సీఎం స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేష్ బలి అయ్యారని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటోందని సీఎం స్పష్టం చేసారు. రాకేష్ మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేసిన సీఎం కెసిఆర్.. రాకేష్ కుటుంబానికి రూ.రూ.25లక్షల పరిహారాన్ని ప్రకటించడంతో పాటు అతని కుటుంబంలో అర్హులైన వారికి వారి అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.