విజయ దశమి రోజు పర్వదినం రోజున కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటక (బెంగళూరు) లోని బీమనకొల్లి మహాదేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోనియా ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన వీడియోను కర్ణాటక కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం సోనియా గాంధీ కర్ణాటక పర్యటనలో ఉన్నారు. సోనియా కుమారుడు, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దసరా పండుగను పురస్కరించుకుని యాత్రకు రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు విరామం ఇచ్చారు.
ఈ క్రమంలోనే కుమారుడిని కలిసి రేపు పాదయాత్రలో పాల్గొనేందుకు గానూ రెండు రోజుల క్రితమే (మైసూర్) కర్ణాటకకు చేరుకున్నారు సోనియా గాంధీ. ఈ క్రమంలో బుధవారం సోనియా గాంధీ .. బెంగళూరు – హోసూరు మధ్యలో ఉన్న బెంగళూరు భీమనకొల్లి మహాదేశ్వరాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన సోనియా గాంధీ.. హారతి అందుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. దర్శనం అనంతరం కొద్దిసేపు ఆలయ ఆవరణలో కూర్చున్నారు. సోనియా వెంట పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ಎಚ್.ಡಿ. ಕೋಟೆಯಲ್ಲಿ ವಾಸ್ತವ್ಯ ಹೂಡಿರುವ ಶ್ರೀಮತಿ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಅವರು ವಿಜಯದಶಮಿಯ ನಿಮಿತ್ತ ಬೇಗೂರು ಗ್ರಾಮದ ಭೀಮನಕೊಲ್ಲಿ ಮಹದೇಶ್ವರ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಿದರು.
AICC President Smt.Sonia Gandhi took blessings at Bhimanakolli Mahadeshwara temple in Beguru village on the occasion of #VijayaDashmi. pic.twitter.com/XJgQMM1XCM
— DK Shivakumar (@DKShivakumar) October 5, 2022
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?