NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

AIMIM : బిజెపికి మతిపోగొట్టిన మజ్లిస్!గోద్రా మేయర్ పీఠాని కే ఎసరు!

AIMIM : హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ గుజరాత్ రాష్ట్రంలో అధికార బీజేపీకి షాకిచ్చింది. గోద్రా మున్సిపాలిటీ పీఠాన్ని బీజేపీ తిరిగి దక్కించుకోకుండా అడ్డుకుంది. అంతేకాకుండా తమ పార్టీ అభ్యర్థి మేయర్ పీఠాన్ని దక్కించుకునేలా పావులు కదిపింది. దీంతో.. 2002 తర్వాత తొలిసారి ఈ మున్సిపాలిటీని బీజేపీ కోల్పోయినట్లైంది.

aimim prevents bjp in godhra
aimim prevents bjp in godhra

గోద్రా మున్సిపాలిటీలో మొత్తం 44 స్థానాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 18 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. తొలిసారి బరిలోకి దిగిన ఎంఐఎం ఏడు చోట్ల విజయం సాధించింది. 17 మంది స్వతంత్రులు గెలుపొందారు. అయితే స్వతంత్రుల బృందానికి ఎంఐఎం మద్దతు ప్రకటించింది. స్వతంత్రులకు.. తమ పార్టీ నుంచి గెలిచిన ఏడుగురు సభ్యుల మద్దతు ఉంటుందని ప్రకటించింది. దీంతో గోద్రా మున్సిపాలిటీ పీఠాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు బీజేపీకి దారులు మూసుకుపోయాయి. కాగా,17మంది స్వతంత్రులలో 5గురు ముస్లిమేతరులు కావడం విశేషం.

AIMIM : అంతం కాదిది ఆరంభం!

ఎంఐఎం గుజరాత్ అధ్యక్షుడు సాబిర్ కబ్లివాలా మాట్లాడుతూ..గోద్రాలో బీజేపీ అధికారంలోకి రాకుండా విజయవంతంగా అడ్డుకున్నామని తెలిపారు. గోద్రా ప్రజలు భాజపా పాలన పట్ల విసుగుచెందారన్నారు. తమ మద్దతుతో స్వతంత్రులకు అధికారం చేపట్టేందుకు కావాల్సిన ఆధిక్యం లభించిందని సాబిర్ కబ్లివాలా తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులు సంజయ్ సోనీని అధ్యక్షుడిగా, అక్రమ్ పటేల్​ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. 2022లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సైతం కసరత్తు ప్రారంభించినట్లు సాబిర్ తెలిపారు.

కాగా, గోద్రా పట్టణం 2002లో మత ఘర్షణలకు ప్రధాన కేంద్రంగా నిలిచిన విషయం తెలిసిందే. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్‌లో…సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు ఎస్-6 బోగీకి దుండగులు నిప్పు పెట్టడంతో కాలి బూడిదైంది. ఈ ఘటనలో 59 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది అయోధ్య పర్యటనకు వెళ్లి తిరిగొస్తున్న వారే కావడం గమనార్హం. ఈ ఘటన తర్వాత గుజరాత్ అట్టుడికిపోయింది. రెండు వర్గాల మధ్య చిచ్చు రేగింది. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో వందలాది మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది ముస్లింలు ఉండగా.. కొంత మంది హిందువులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు బీజేపీకి పెట్టని కోటలా ఉన్న గోద్రా ప్రాంతంలో తొలిసారిగా కాషాయేతర జెండా ఎగురనుండటం సంచలన విషయమే.మరోవైపు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏడు స్థానాల్లో,మొదసా మున్సిపాలిటీలో 12 స్థానాల్లో పోటీ చేసి 9 స్థానాలను ఎంఐఎం కైవసం చేసుకుంది. మరోవైపు.. సూరత్ మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ తన సత్తా చాటిన విషయం తెలిసిందే. తొలిసారిగా గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్.. సూరత్‌ మున్సిపాలిటీలో ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.

 

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!