AIRSTRIKE: ఇథియోఫియాలోని టిగ్రే ప్రాంతంలో వైమానిక దాడి జరిగింది. రద్దీగా ఉండే మార్కెట్ పై మంగళవారం వైమానక దాడి జరిగిందని ఆ దేశ ఆరోగ్య కార్యకర్తలు తెలిపారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పౌరులు మృతి చెందినట్లు చెప్పారు. తమ బృందాలను ఘటనా స్థలానికి వెళ్లేందుకు ఇరాన్ సైన్యం అనుమతి ఇవ్వడం లేదని ఆరోగ్య కార్యకర్తలు వెల్లడించారు.
స్థానికంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తల అందించిన వివరాల ప్రకారం సుమారు 80మందికిపైగా పౌరులు మృతి చెందినట్ల తెలిసిందని టిగ్రే ప్రాంతానికి చెందిన వైద్యుడు ఒకరు తెలిపారు. అయితే ఈ ఘటనపై ఇథియోపియా ప్రధాన మంత్రి ఇంకా స్పందించలేదు.