Aishwaryaa Dhanush: దేశంలో చాలా మంది దంపతులు మనస్పర్దల కారణంగానో ఇంకా వేరే కారణంతోనే విడిపోతుంటారు. విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు సాగిస్తుంటారు. కానీ సామాన్యుల విషయం గురించి ఎవరూ అంతగా పట్టించుకోరు. కానీ సెలబ్రిటీల వివాహా వేడుకలు మొదలు కొని వారి ఇంట్లో విషయాలు, ఒక వేళ వాళ్లలో మనస్పర్దలు వస్తే వాటిని, విడాకులు తీసుకుంటే వాటిని, ఆ తరువాత వారు ఏమి చేస్తున్నారు అనే విషయాలపై సోషల్ మీడియా ఫోకస్ పెడుతూనే ఉంటుంది. నాగచైతన్య, సమంత విడిపోయి చాలా కాలం అయినా ఇంకా వారి వ్యవహారాలపై సోషల్ మీడియాలో ఏదో ఒకటి వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది.
Aishwaryaa Dhanush: హైదరాబాద్ హోటల్ లో ధనుష్ – ఐశ్వర్య
ఇప్పుడు విడిపోయిన సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, ధనుష్ లు ఏమి చేస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. అయితే కొందరు సెలబ్రిటీలు జీవతంలో జరిగిన గాయాలను త్వరగా మరిచిపోతుంటారు. కానీ కొందరు ఆ గాయాలను తలుచుకుంటూ కొంత కాలం బాధపడుతూనే ఉంటారు. ఇప్పుడు ధనుష్ పరిస్థితి అలానే ఉందని ఇండస్ట్రీ టాక్. ధనుష్ – ఐశ్వర్య ఇటీవల విడిపోయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీళ్ల విడాకులు అందరినీ షాక్ కు గురి చేశాయి. ఎందుకంటే వీళ్లు విడిపోతున్నట్లు ప్రకటించే వరకూ వారి మధ్య సమస్యల గురించి మీడియాకు ఒక్క క్లూ కూడా లేదు. దీంతో ఇది హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల వీరు ఇద్దరు వేర్వేరు పనులపై హైదరాబాద్ కు వచ్చారు. యాదృశ్చికంగా ఒకే హోటల్ లో వేరువేరుగా బస చేశారు.
సాధారణ జీవనంలోకి వచ్చేసిన ఐశ్వర్య
అయితే విడాకుల బాధ నుండి ఐశ్వర్య త్వరగానే కొలుకున్నట్లుగా కనిపిస్తుందని ఆమెను నిశితంగా గమనించిన వ్యక్తులు చెబుతున్నారు. ఆమె స్నేహితులను కలుస్తూ, పార్టీలకు హాజరవుతూ సాధారణంగానే కనిపిస్తోందట. అయితే దీనికి పూర్తి విరుద్దంగా ధనుష్ ఉంటున్నారుట. ధనుష్ సన్నిహితులకు కూడా దూరంగా ఉంటున్నారని టాక్. సెట్ లో కూడా షాట్ ని పూర్తి చేసి ఒంటరిగానే ఉంటున్నాడుట. ఎప్పుడూ ఏదో వెలితీగా మనాదిగా ధనుష్ ముఖం కనబడుతోందని అంటున్నారు. విడాకుల గాయం నుండి ధనుష్ ఇంకా కోలుకోలేదనీ, అందుకే లోలోపల భాధపడుతున్నట్లు ఉందని అభిమానులు భావిస్తున్నారు. కొంత మంది వారి బాధను లోపల అనుచుకుని చిరునవ్వుతో బయటకు కనిపిస్తుంటారు. కానీ ధనుష్ ఆ విధంగా కనిపించడం లేదని అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?