Ajith : కోలీవుడ్ స్టార్ హీరోలలో అజిత్ కుమార్కి ఉన్న సత్తా ఏ రేంజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో అలాగే బాలీవుడ్ మేకర్ బోనీకపూర్ నిర్మాతగా హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన నెర్కొండ పార్వై సినిమాలలో వరుసగా సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. దాంతో అజిత్ క్రేజ్ మరో స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం వాలిమై రిలీజ్ కి ముందే కళ్ళు తిరిగే బిజినెస్ చేసి కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సూపర్ హిట్ కాంబినేషన్ అయిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ – హెచ్.వినోద్ – అజిత్ కాంబినేషన్ లో ఈ వాలిమై రూపొందింది.
ఈ సినిమాలో తెలుగు యంగ్ హీరో ఆర్ ఎక్స్ 100 ఫేం కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక అజిత్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ నటించగా, యోగిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ మూవీకి అజిత్ కి ఎంతో ఫేవరేట్ సంగీత దర్శకుడయిన యువన్ శంకర్రాజా సంగీతం అందించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నివర్ షా ఫొటోగ్రఫీ అందించారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. కాగా ఈ మధ్య ఈ సినిమా కి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. అప్డేట్స్ కోసం అజిత్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Ajith : నిర్మాతకి భారీ లాభాలు రావడం పక్కా అంటున్నారు.
వాస్తవంగా అయితే వాలిమై షూటింగు కంప్లీట్ అయి ఎపుడో రిలీజ్ అవ్వాలి. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా షూటింగ్ కి బాగా అంతరాయం కలిగింది. ఇప్పటికే 90 శాతం వరకు షూటింగు పూర్తి చేశారు. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గి మళ్ళీ సినిమా షూటింగ్స్ అన్నీ మొదలవుతున్నాయి. ఈ క్రమంలో వాలిమై కూడా ఈనెలలో ఫస్ట్లుక్ను రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. అయితే ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగినట్టు కోలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. దాదాపు రూ.200 వరకు బిజినెస్ అయినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే గ్యారెంటీగా నిర్మాతకి భారీ లాభాలు రావడం పక్కా అంటున్నారు.