తమిళ స్టార్ హీరో అజిత్ అంటే తెలియని వారుండరు. ప్రేమ పుస్తకం అనే సినిమాతో టాలివుడ్ లో ప్రవేశించి తనదైన నటనా శైలితో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రేమలేఖ సినిమాతో అజిత్ తెలుగు, తమిళ ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. తెలుగు వాడైనా అజిత్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్, విక్రం లాంటి సీనియర్ స్టార్ హీరోలతో పాటు విజయ్, సూర్య, కార్తి లాంటి స్టార్ హీరోలున్నప్పటికి అజిత్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
వాలి సినిమాతో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక బిల్లా వంటి సినిమాతో తిరుగులేని స్టార్ డం సాధించాడు. అజిత్ నటించిన సినిమాలన్ని దాదాపు తెలుగులోనూ రిలీజై సూపర్ హిట్ గా నిలిచాయి. తెలుగు స్టార్ హీరోకి ఉన్న క్రేజ్ ఉండటం గొప్ప విషయం. అజిత్ నటించిన ఎంతవాడుగాని, విశ్వాసం లాంటి సినిమాలు తెలుగులో మంచి వసూళ్ళని రాబట్టాయి. కాగా అజిత్.. శివ దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్స్ నటించి వరసగా హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం ‘వాలిమై’ సినిమాను చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ మొత్తం దాదాపుగా హైదరాబాద్ లో చేయడం విశేషం. అజిత్ హీరోగా రూపొందబోతున్న ఈ సినిమాకు తమిళ స్టార్ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. బోణీ కపూర్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇంతక ముందు అజిత్ తో బోనీ కపూర్ బాలీవుడ్ పింక్ సినిమాని తమిళం లో నేర్కొండ పార్వై గా రీమేక్ చేసి భారీ హిట్ అందుకున్నారు. దాంతో ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెరిగాయి. అయితే ఇప్పుడు అజిత్ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఇలా డబ్బింగ్ రైట్స్ కోసం భారీ మొత్తం కేటాయించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసిన బడ్జెట్ తో మీడియం బడ్జెట్ సినిమా తీయొచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!