AK: ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు, త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలలో “జల్సా”, “అత్తారింటికి దారేది” సినిమాలు పవన్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచాయి. అదేవిధంగా వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మరో చిత్రం”అజ్ఞాతవాసి”ఈ సినిమా పవన్ కెరీర్లోనే ఒక పెద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది. కేవలం సినిమా పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కు మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రేక్షకుల కోరిక మేరకే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేస్తున్నారు. కానీ, పవన్ నటించే ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించకుండా కేవలం స్క్రీన్ ప్లే డైలాగులను మాత్రమే అందించనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తున్నాడు అనే చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ,రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న మలయాళ సినిమా “అయ్యప్పనుమ్ కోషియమ్” తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే డైలాగులను అందించనున్నారు.
ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణం హైదరాబాద్ ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలుపెట్టారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను చిత్ర బృందం విడుదల చేశారు.ఈ వీడియోలో సినిమా షూటింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతుండడం పవన్ కళ్యాణ్ సెట్లోకి అడుగు పెట్టడం వంటి సన్నివేశాలను చూడవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోలో ఎక్కువశాతం త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించాడు. పవన్ కళ్యాణ్ ‘ఏకే’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నది సాగర్ కే చంద్ర అయినప్పటికీ, సినిమా మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో జరుగుతుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు దర్శకుడు సాగర్ కే చంద్ర అయితే హడావిడి మొత్తం త్రివిక్రమ్ దేనంటూ తమదైన శైలిలో పవన్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘ఏకే’ రీమేక్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. “అప్పట్లో ఒకడుండేవాడు” వంటి వైవిధ్యమైన సినిమా తీసిన సాగర్ కి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.