Dead while watching Akhanda: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా తెరకెక్కిన అఖండ మూవీ డిసెంబర్ 2న రిలీజ్ అయింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మన దేశంలో కూడా బయటపడుతున్నా కానీ జనాలు ఎవరూ భయపడకుండా అఖండ సినిమాకు వెళ్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి చనిపోయాడనే వార్త తెగ వైరల్ గా మారింది.
బోయపాటి మాస్ లుక్స్…
నందమూరి బాలకృష్ణ (Balakrishna), డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇప్పటికే లెజెండ్ , సింహా వంటి హిట్ మూవీలు వచ్చాయి. ఈ సినిమాలు ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి. ఇక ముచ్చటగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ అనే సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేసి అదరగొట్టాడు. ప్రగ్యా జైస్వాల్ బాలయ్యకు జోడీగా నటించింది. అయితే అఖండ సినిమాను ఓ వ్యక్తి చూస్తూ చనిపోయాడు. ఇప్పటికే ఈ వార్త అంతటా తెలియడంతో ఈ వార్త విన్న బాలయ్య అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.
అఖండ చూస్తూ కన్నుమూత
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే శ్రోతలను ఓ ఊపు ఊపుతున్నాయి. సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం ఫుల్ జోష్ లో ఉంది. కానీ తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడయిన రామకృష్ణ రాజమహేంద్రవరంలోని శ్యామల థియేటర్ లో అఖండ మూవీని చూస్తూ కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించినా.. లాభం లేకపోయింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి రామకృష్ణ మరణించినట్లు ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలియడంతో బాలయ్య అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా నైరాశ్యంలో కూరుకుపోయారు.