అక్కినేని వారసుడిగా చిత్రసీమకు పరిచయం అయిన అఖిల్ ఇప్పటి వరకు విజయ తీరాలను అందుకోలేకపోయాడన్న విషయం తెలిసిందే. అఖిల్ హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం ‘అఖిల్’ బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. ఆ తర్వాత చేసిన ‘హలో’ సినిమాతో ప్రయోగం చేసినా ఆడియన్స్ ను మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇక మూడో చిత్రం ‘మిస్టర్ మజ్ను’ కూడా అఖిల్ ఆశల పై నీళ్లు చల్లింది. ఈ క్రమంలో తన నాల్గోవ చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ అన్న సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చెప్పాలంటే అఖిల్ ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెట్టుకున్నాడు.
కాగా ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాని అంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా అందుకోని అఖిల్ 5 మీద దాదాపు 45 కోట్లు పెట్టడానికి నిర్మాత అనిల్ సుంకర రెడీ అవుతున్నాడట. అయితే అఖిల్ సినిమాకు 25 కోట్లకు మించి బిజినెస్ కాదన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. అయినా అనిల్ సుంకర రిస్క్ కి రెడీ అంటున్నాడు.
స్టైలిష్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి కి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంది. అదీ కాక మెగా హీరోలైన రాం చరణ్ తో ధృవ, ఆ తర్వాత మెగాస్టార్ తో సైరా లాంటి పాన్ ఇండియన్ సినిమాని చేసి సురేందర్ రెడ్డి దర్శకుడిగా అసాధారణమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు. దాంతో అఖిల్ తో సురేందర్ రెడ్డి చేస్తున్న సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. అంతేకాదు సురేందర్ రెడ్డి కూడా ఈ సినిమాకి ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
మరి అఖిల్ మీద నిజంగా 40 కోట్ల బడ్జెట్ కేటాయించడం కరెక్టేనా అన్న టాక్ మొదలైంది. అయితే ఇది అఫీషియల్ గా మేకర్స్ నుంచి తెలిసిన విషయం కాదు కాబట్టి ఈ విషయాన్ని నమ్మడానికి లేదు. ఎందుకంటే నాగార్జున కూడా నిర్మాత కాబట్టి .. బడ్జెట్ విషయంలో పక్కాగా ఉంటాడు కాబట్టి నాగార్జున హీరో మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టనివ్వడు. చూడాలి మరి ఈ విషయంలో నిజమెంత ఉందన్నది.