Akhil : అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బాచ్లర్ అన్న సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అఖిల్ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు అఖిల్. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. విక్రం కె కుమార్ తో హలో సినిమా చేశాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. మూడవ సినిమా యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేశాడు అఖిల్. మిస్టర్ మజ్ఞు అన్న టైటిల్ తో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. అంతేకాదు ఈ సినిమాతో అఖిల్ కి టాలీవుడ్ లో క్రేజ్ కూడా బాగానే వచ్చింది.
ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అన్న సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ అవుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ పై బన్నీ వాసు – వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. జూన్ 19 న ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అఖిల్ కెరీర్ లో ఫస్ట్ భారీ హిట్ అందుకోబోతున్నాడని చెప్పుకుంటున్నారు.
Akhil : అఖిల్ తో పాటు నాగార్జున ఈ లేటెస్ట్ ప్రాజెక్ట్ మీద భారీగా అంచనాలున్నాలు పెట్టుకున్నారట.
అయితే కొంతమందిలో మాత్రం చిన్న చిన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని సీన్స్ రీ షూట్ కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి. సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ జూన్ వరకు పోస్ట్ పోన్ అవడం కూడా అందరిలో కొత్త సందేహాలు మొదలవడానికి కారణం అయింది. ఇక అఖిల్ తో పాటు దర్శకుడి కి సక్సస్ లు లేవు. అందుకే అఖిల్ నెక్స్ట్ చేయబోయో సురేందర్ రెడ్డి సినిమా మీద షూటింగ్ మొదలవకుండానే పాజిటివ్ టాక్ వచ్చేసిందని చెప్పుకుంటున్నారు. అఖిల్ తో పాటు నాగార్జున ఈ లేటెస్ట్ ప్రాజెక్ట్ మీద భారీగా అంచనాలు పెట్టుకున్నారట.