Akhil : అఖిల్ కెరీర్ లో 4 వ సినిమాగా రాబోతోంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్పై బన్నీ వాసు – వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. వాస్తవంగా ఈ సినిమా జూన్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ బ్యాచ్లర్ కి అసలు టైం బాగోలేదు. ఎప్పుడు వద్దామనుకున్న ఏదో ఒక రకంగా బ్రేక్ పడుతూనే ఉంది.
ఇప్పటికే రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూ 14 నెలలు గడిచింది. అభిమానులే కాదు అఖిల్ కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో అని ఎదురు చూస్తున్నాడు. కానీ మళ్ళీ ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అంటున్నారు. ఇప్పటికే అఖిల్ నుంచి మూడు సినిమాలు వచ్చినప్పటికి ఒక్క హిట్ తన ఖాతాలో పడలేదు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలతో వచ్చిన అఖిల్ కి బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిలింది. అందుకే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా మీద చాలానే నమ్మకాలు పెట్టుకున్నాడు. ఈ సక్సస్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి చాలా కీలకం.
Akhil : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే కరోనాతో గత ఏడాది కొన్ని నెలలు బ్రేక్ వేస్తే.. రీ షూట్ వల్ల రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమా గత ఏడాది శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ కరోనా ఫస్ట్ వేవ్ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత విజయదశమి కి అనుకున్నారు. కానీ లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ జరగకపోవడంతో 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నా మళ్ళీ పోస్ట్ పోన్ చేయక తప్పలేదు. ఇక జనవరి నుంచి ఏప్రిల్..ఏప్రిల్ నుంచి జూన్ 19కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.