Akhil : అఖిల్ అక్కినేని నటిస్తున్న 5 వ సినిమాలో హీరోయిన్ కోసం సురేందర్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటి వరకు అఖిల్ నటించిన సినిమాలలో హీరోయిన్ కరెక్ట్ గా సూటవలేదని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు సినిమాలలో నటించిన అఖిల్ కి ఇదే సమస్య అని టాక్ వచ్చింది. ఇక ప్రస్తుతం చేయబోతున్న అఖిల్ 4 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా విషయంలో కూడా హీరోయిన్ గురించి కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అందుకే త్వరలో సెట్స్ మీదకి రాబోతున్న అఖిల్ 5 కి హీరోయిన్ విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం సురేందర్ రెడ్డి పలువురు యంగ్ బ్యూటీస్ ని పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ప్రియాంక అరుల్ మోహన్ ని తీసుకున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆ తర్వాత సాక్షి వైద్య ని తీసుకున్నారని ప్రచారం జరిగింది. కాని ఈ విషయంలో కూడా క్లారిటీ లేదు.
Akhil : కృతిశెట్టి నాలుగో సినిమా అఖిల్ తో చేయబోతుందన్న వార్తలు మొదలయ్యాయి.
కాగా తాజాగా ఉప్పెన ఫేం కృతిశెట్టి పేరు ప్రచారంలో కి వచ్చింది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్న కృతిశెట్టి ఇప్పటికే నాని నటిస్తున్న శ్యాం సింగ్ రాయ్ సినిమాలో నటిస్తోంది. అలాగే ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు నటిస్తున్న సినిమాలో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా కృతిశెట్టి నాలుగో సినిమా అఖిల్ తో చేయబోతుందన్న వార్తలు మొదలయ్యాయి. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో. ఇక ఈ సినిమాని అనిల్ సుంకర – సురేందర్ రెడ్డి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.