సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ను ప్రయాగ్రాజ్ (అలహాబాద్) వెళ్లకుండా లక్నో పోలీసులు అడ్డుకోవడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పి కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు. పోలీసులు ఎక్కడికక్కడ వారిపై విరుచుకు పడ్డారు.
అలహాబాద్ యూనివర్సిటీలో ఒక విద్యార్ధి సంఘం కార్యక్రమానికి బయలుదేరిన అఖిలేష్ను విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి లిఖిత ఉత్తర్వులూ లేకుండా తనను ఎయిర్పోర్టులో నిర్బంధించారని అఖిలేష్ ట్వీట్ చేశారు.
అఖిలేష్ ఆ కార్యక్రమానికి వెళితే హింస చెలరేగుతుందన్న సమాచారం అలహాబాద్ అధికారుల నుంచి రావడంతో ఆయనను ఆపాల్సివచ్చిందని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ పేర్కొన్నారు. ఒక విద్యార్ధి సంఘం నాయకుడి పదవీస్వీకార కార్యక్రమం చూసి కూడా ఆదిత్యనాధ్ ప్రభుత్వం ఎంత భయపడుతున్నదో దీని వల్ల అర్ధం అవుతోందని అఖిలేష్ వ్యాఖ్యానించారు.
बिना किसी लिखित आदेश के मुझे एयरपोर्ट पर रोका गया। पूछने पर भी स्थिति साफ करने में अधिकारी विफल रहे। छात्र संघ कार्यक्रम में जाने से रोकना का एक मात्र मकसद युवाओं के बीच समाजवादी विचारों और आवाज को दबाना है। pic.twitter.com/151IwzPl1t
— Akhilesh Yadav (@yadavakhilesh) February 12, 2019
బిజెపి ప్రభుత్వం నిరంకుశ, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు ఈ సంఘటన నిదర్శనమని బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి వ్యాఖ్యానించారు.
Extremely condemnable that Samajwadi Party President and former UP Chief Minister Akhilesh Yadav was stopped at Lucknow airport today in order to prevent him from attending programme in Allahabad. This is anti-democratic and an example of total dictatorship of BJP government.
— Mayawati (@Mayawati) February 12, 2019
పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా దీనిపై స్పందించారు. ‘గుజరాత్లో జిగ్నేష్ మేవానీని కూడా ఇలాగే అడ్డుకున్నారు. వారు విద్వేష రాజకీయాలు నడుపుతారు. పైగా నీతులు చెబుతారు. దేశంలో ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు’ అని ఆమె వ్యాఖ్యానించారు.