టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు ప్రజల్లో ఎంత ఫాలోయింగ్ ఉందొ మనకి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో విడాకుల తీసుకున్న తరువాత రేణు దేశాయ్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటం ప్రారంభించారు. ఇక ఆ తరువాత ఆమె రెండవ పెళ్ళి చేసుకోబోతుంది అన్న వార్తలు రావడంతో పవన్ ఫాన్స్ షాక్ అయ్యారు.
రేణుదేశాయ్ ప్రస్తుతం నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా లో తన వర్క్ కి సంబంధించి ఏదో ఒక పోస్ట్ ను షేర్ చేస్తూనే ఉంటుంది. తన పిల్లలు ఆద్య మరియు అకీరా నందన్ గురించి రెగ్యులర్ గా చెప్తూనే ఉంటుంది. అంతేకాకుండా తన సోషల్ మీడియాలో ఎక్కువగా తన పిల్లల గురించే పోస్ట్ చేస్తూఉంటుంది. అందులోనూ కూతురి గురించి తక్కువే కానీ కొడుకు గురించి ఎక్కువగా పోస్ట్ చేస్తారు. ఇక ఇటీవలే ఆమె మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం, రేణు దేశాయ్ జీ తెలుగు ఛానల్ లో ప్రసారం కానున్న ఓ ప్రోగ్రాంలో నటిస్తోందట. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ గురించి మనం రోజు వింటూనే ఉంటాం. తాజాగా తన కొడుకు అకిరా క్రియేట్ చేసిన ఒక ఫన్నీ మీమ్ ని తన ఇంస్టాగ్రామ్ వేదికగా రేణు దేశాయ్ షేర్ చేసింది. వారి పెంపుడు పిల్లులు రెండు ఆ మీమ్ లో ఆడుకుంటూ కనిపిస్తాయి. అందులో పెద్ద పిల్లి చిన్న పిల్లిని పట్టుకొని ఉంది. ఇక అది ఫోటో తీసి అకిరా, 2020లో నలిగిపోయినట్లుగా మీమ్ క్రియేట్ చేసాడు. ఈ మీమ్ లో పెద్ద పిల్లి 2020 సంవత్సరం అలాగే దాని చేతిలో నలిగిన చిన్న పిల్లి నేను అంటూ సరదాగా రాసాడు. ప్రస్తుతం ఆ మీమ్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.