అక్కినేని వారి కుటుంబంలోని మూడు తరాలు కలిసి నటించి అందరికీ కన్నుల విందు చేసిన మూవీ ‘మనం’. ఈ మూవీనీ తన సొంత పతాకమైన అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున నిర్మించారు. మల్టీస్టారర్ గా ఈ మూవీ ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీలో మూడు తరాలైన నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు, ఈయన కొడుకు యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, ఈయన కొడుకులు అక్కినేని నాగచైతన్య, అఖీల్ ఇలా అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి తెరకెక్కిన మనం సినిమా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన చివరి సినిమా కుడా ఇదే. ఈ అరుదైన చిత్రంలో శ్రియా, సమంత కథానాయికలుగా నటించారు. ఈ మూవీకి నితీన్, నిత్యామీనన్ హీరో, హీరోయిన్ గా తెరక్కిన్న ఇష్క సినిమా ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న విక్రమ్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. అలాగే అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
ఒకే ఫ్రేమ్ లో అక్కినేని కుటుంబమంతా కనిపించి ఎంతో మంది అభిమానుల అభినందనలు అందుకున్నారు అక్కినేని వారు. కాగా ఈ అక్కినేని ఫ్యామిలీ మళ్లీ మల్టీస్టారర్ గా మరో సినిమాల్లో కనిపించేందుకు సిద్దమవుతున్నారని టాక్ నడుస్తోంది. ఈ మూవీలో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, అతని ఇద్దరు కుమారులు నాగార్జున, అఖిల్ కలిసి మరో సినిమాలను తీయబోతున్నారనే ప్లాన్ లో నాగార్జున ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ అక్కినేని వారి సినిమాకు రవీంద్రన్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే నాగార్జున నటించిన మన్మథుడు 2 మూవీకి రవీంద్రన్ నే దర్వకత్వం వహించాడు. అయితే మనం సినిమా తర్వాత మళ్లీ మరో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తున్నది. మరి ఈ సినిమాల ఏ కథాంశంతో అభిమానుల ముందుకు రాబోతోందో చూడాలి.