Akkineni heros: ఇటీవల అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య అక్కినేని, అఖిల్ అక్కినేని తమ సినిమాలతో వచ్చి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. నాగ చైతన్య మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. సమంతతో కలిసి నటించిన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత సమంత రెండు సినిమాలు చేసింది. కానీ నాగ చైతన్య మాత్రం గ్యాప్ తీసుకున్నాడు. ఆర్.ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో మహా సముద్రం చేయాల్సింది. కానీ అన్నీ ఓకే అనుకున్న తర్వాత ప్రాజెక్ట్ నుంచి చైతూ తప్పకున్నాడు.
ఆ తర్వాత పలు దర్శక, నిర్మాతలతో చర్చలు జరిపిన చైతూ ఫైనల్గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ వారు మొదటి సారి నిర్మాణ రంగంలోకి దిగుతూ ఈ సినిమాను నిర్మించారు. నారాయణ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు కలిసి నిర్మించిన ఈ సినిమా కరోనా వేవ్స్ కారణంగా పలు వాయిదాల తర్వాత రిలీజ్ అయింది. అయితే ఇలా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతున్నా కూడా సినిమా మీద మేకర్స్ మంచి బజ్ క్రియేట్ చేశారు.
Akkineni heros: ఈ ఒక్క సినిమాతో గత మూడు చిత్రాలను మర్చిపోయేలా చేశాడు అఖిల్.
ఆ రకంగా లవ్ స్టోరి సినిమా మీద రిలీజ్ కి మంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా భారీ కమర్షియల్ సక్సెస్ సాధించింది. శేఖర్ కమ్ముల, నిర్మాతలు ఎంత నమ్మకంగా ఉన్నారో ఆ నమ్మకం నిజమైంది. మజిలీ తర్వాత గ్యాప్ వచ్చినా కూడా లవ్ స్టోరి మూవీతో చైతూ హిట్ కొట్టాడు. ఇక అఖిల్ హీరోగా పరిచయమయ్యాక ఇప్పటి వరకు మూడు సినిమాలను చేశాడు. మొదటి సినిమా అఖిల్ ..రెండవ సినిమా హలో, మూడవ సినిమా మిస్టర్ మజ్ఞు.
అయితే ఈ మూడు సినిమాలు అఖిల్కు ఏమాత్రం హీరో ఇమేజ్ను తీసుకురాలేకపోయాయి. ఎట్టకేలకి ఇటీవల వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మూవీతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఈ ఒక్క సినిమాతో గత మూడు చిత్రాలను మర్చిపోయేలా చేశాడు అఖిల్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కనిపించని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ మళ్ళీ సినిమా కోసం దాదాపు మూడేళ్ళు కష్టపడి..ఎట్టకేలకి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
Akkineni heros: ఇక మిగిలింది నాగార్జుననే..
ఇలా నాగార్జున ఇద్దరు కొడుకులు తమ సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇక మిగిలింది నాగార్జుననే. ప్రస్తుతం ఆయన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ బంగార్రాజు సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను అన్నీ అనుకున్నట్టుగా జరిగితే సంక్రాంతి బరిలో దింపే పయత్నాలు చేస్తున్నారట. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగ చైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటిస్తున్నారు. నాగార్జున కూడా ఓ భారీ హిట్ కొడితే అక్కినేని హీరోలు అందరూ వరుసగా మంచి హిట్ అందుకున్నవారవుతారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.