Nagarjuna అక్కినేని ఫ్యాన్స్ చిరకాలం గుర్తుంచుకునే సినిమా ‘మనం’. మొత్తం అక్కినేని ఫ్యామిలీ ఈ సినిమాలో కనపడి ఫాన్స్ లు కనువిందు చేశారు. లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజుల్లో ఆ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తీయాలని దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ప్లాన్ చేస్తున్నారు. మరోసారి నాగార్జునతో ప్రాజెక్టు పై చర్చ జరిగినట్లు సమాచారం.
దర్శకుడు విక్రమ్ కె.కుమార్ విన్నూత సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. అక్కినేని ఫ్యామిలీ కూడా అతని కుటుంబ సభ్యుడి లాగానే భావిస్తారు. వారి ఫ్యామిలీ లో ఎలాంటి వేడుకలు జరిగినా దర్శకుడు విక్రమ్ కు పిలుపు వెళుతుంది. అఖిల్ కు ‘హలో’ లాంటి మంచి చిత్రాన్ని అందించాడు విక్రమ్. ఇక ఇటీవల దర్శకుడు విక్రమ్…. నాగార్జున తో ఒక స్టోరీ పై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అవుట్ లైన్ సిద్దం అయిందని వార్తలు వచ్చాయి.
ఇక నాగార్జునకి కొన్ని మెయిన్ సీన్స్ పై కూడా దర్శకుడు క్లారిటీ ఇచ్చాడట. ప్రస్తుతం చేస్తున్న ‘థాంక్యూ’ సినిమా అయిపోయిన తర్వాత ఒక సీనియర్ రైటర్ తో కూర్చుని కథ మొత్తం సిద్ధం చేసే పనిలో విక్రమ్ కె కుమార్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈసారి ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలు కూడా కనిపించబోతున్నట్లు సమాచారం.
Nagarjuna కుటుంబం అంతా….
మొదటి భాగంలో అఖిల్ కేవలం గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపించాడు. సుశాంత్, సుమంత్ లకు అవకాశం లభించలేదు. ఇక ఈసారి వారిద్దరు తోపాటు అమల కూడా కథలో భాగం అయ్యేలాగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా ను సెట్స్ పైకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మరి అక్కినేని ఫ్యాన్స్ కి మాత్రం మరొకసారి తన అభిమాన కుటుంబం మొత్తం కనబడితే చూడాలని ఉండదా…?