Akkineni Samantha: ఏఎన్ఆర్ కాలం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అక్కినేని ఫ్యామిలీ కి ఉన్న ఫాలోయింగ్ గురించి మన అందరికి తెలిసిందే. ఎటువంటి సపోర్ట్ లేకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోకి వచ్చి అక్కినేని నాగేశ్వరరావు అగ్ర కథానాయకుడిగా తన నటనతో తెలుగు సినిమా చరిత్రలోనే చెరగని ముద్రవేశారు. అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం చెన్నై కేంద్రబిందువుగా ఉన్న రోజులో చిత్ర పరిశ్రమను చెన్నై నుంచి హైదారాబాద్ కు తీసుకురావడంలో ఏఎన్నార్ పాత్ర చాలా కీలక మైనదట. ఆ తరువాత ఆయన తనయుడు నాగార్జున టాలీవుడ్లో అడుగుపెట్టి తన రూపం, అభినయం, నటనతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
తదుపరి కాలంలో తండ్రి బాటలో నడిచి నిర్మాతగా మారాడు అక్కినేని నాగార్జున. తన తండ్రి అక్కినేని నాగేశ్వరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను చేపట్టాడు. అలాగే అన్నపూర్ణ స్టూడియో బ్యానర్పై చాలా చిత్రాలకు నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటుగా నాగార్జున గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటరప్రైజెస్ బ్యానర్ను స్థాపించారు. తాజాగా అక్కినేని నాగ చైతన్య తన భార్య అక్కినేని సమంతతో కలిసి త్వరలో సొంత బ్యానర్ను ప్రారంభించబోతున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం సమంత కూడా కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ వైపు ద్రుష్టి పెట్టడంతో తన భర్త నాగ చైతన్యతో కలిసి ఈ బ్యానర్ ను స్థాపించనున్నదట. ఈ బ్యానర్ మీద సినిమా తియ్యడం కోసం ఇప్పటికే కొంత మంది దర్శకులు చెప్పిన కథలను సమంత మరియు చైతన్య ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. అంతేకాకుండా త్వరలోనే ఈ బ్యానర్కు సంబంధించిన పూర్తి వివరాలు మరియు బ్యానర్ పేరు సామ్-చై లు ప్రకటించే అవకాశం ఉంది.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.