గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి పేరు తలుచుకుంటేనే అందరికి భయంతో వెన్నులో వణుకు పుట్టింది. పక్కవాడు తుమ్మినా, దగ్గినా వారం రోజులు భయంతో ఉండేవారు. ఇక సినిమా స్టార్స్ అయితే ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇలా ఇంకా ఎన్ని నెలలు.. ఇప్పటికే 6 నెలలు గడిచిపోయింది. ఉంటే ఇలాగే ఉంటాం. తెగిస్తే తెడ్డే ఆయుధం.. అన్నట్టుగా మార్పు వస్తోంది జనాలలో. ఇప్పటికే సామాన్య ప్రజలు కరోనా ని లెక్క చేయడం లేదు. ఇప్పుడు సినిమా స్టార్స్ కూడా. నీ అంతు చూస్తాం. అంటూ బయలు దేరారు.
నిన్నా.. మొన్నటి వరకు 50 ప్లస్ హీరోలు బయటకు వచ్చి షూటింగుల్లో పాల్గొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. డాక్టర్లు సలహాల మేరకు కరోనా కి భయపడి ఎవరూ ఇంటి నుంచి బయటకు రాలేదు. వచ్చిన వారికి ఏదో ఒక రకంగా కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇన్నాళ్ళు బాలీవుడ్ ,టాలీవుడ్ లో సీనియర్ హీరోలెవరూ బయటకు వెళ్లేందుకు ఆసక్తిని కనబరచలేదు. కాని ఇప్పుడు సీన్ మారింది. బాలీవుడ్ స్టార్లు కరోనా ని లెక్క చేయకుండా విదేశీ షూటింగులకు బయలుదేరడం అందరికీ షాకిస్తోంది. బెల్ బాటమ్ సినిమా చిత్రీకరణ కోసం అక్షయ్ స్కాట్లాండ్ వెళ్తుండగా.. లాల్ సింగ్ చద్దా సినిమా బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేయడానికి అమీర్ ఖాన్ టర్కీకి వెళ్లాడు. ఇప్పుడు ఈ స్టార్స్ తో పాటు మహేష్ బాబుకు కూడా ‘సర్కారు వారి పాట’ కోసం ఇలాంటి ప్లాన్ వేస్తున్నాడని తాజా సమాచారం.
రీసెంట్ గా మహేష్ అన్నపూర్ణ స్టూడియోలో కమర్షియల్ యాడ్ చిత్రీకరణ లో పాల్గొన్నాడు. ఈ షూట్ తరువాత మహేష్ చాలా జాగ్రత్త పడ్డారు. అంతే ధైర్యం వచ్చేసింది. ఇకపై కోవిడ్ -19 కి భయపడకుండా షూటింగ్ మొదలు పెట్టాల్సిందే అని డిసైడయ్యారు. టాలీవుడ్ ముందుకు సాగడానికి ఆయనే ఇన్స్పిరేషన్ కాబోతున్నాడని అంటున్నారు. ఇక ఇప్పటికే సీనియర్ హీరో నాగార్జున 60 ప్లస్ లో ఉన్నా కూడా ఓవైపు బిగ్ బాస్.. మరోవైపు వైల్డ్ డాగ్ చిత్రీకరణలోనూ పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
మహేష్ – పరశురామ్ బృందం అమెరికా డెట్రాయెట్ లో షూటింగ్ చేయనున్నారట. సర్కార్ వారి పాట చిత్రీకరణ కోసం ఏకంగా చార్టెడ్ విమానాన్ని ఎక్కబోతున్నారని లేటెస్ట్ న్యూస్. మొత్తానికి మహేష్ గట్స్ చూస్తుంటే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నే అంద్రికీ గుర్తొస్తున్నారంటున్నారు. అంతేకాదు ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో షాకవుతున్నారట.