బాలీవుడ్ లో గత నాలుగేళ్ళుగా ఖాన్ ల త్రయాన్ని కూడా వెనక్కి నెట్టి నంబర్ వన్ ప్లేస్ లో కూర్చున్న సినియర్ హీరో అక్షయ్ కుమార్. అక్షయ్ నుంచి వచ్చినన్ని వరస బ్లాక్ బస్టర్ సినిమాలు బాలీవుడ్ లో మరే హీరో నుంచి రాలేదు. అదీ కాక దాదాపు హిట్ అందుకున్న సినిమాలన్ని సామాజిక అంశంతో తెరకెక్కినవే కావడం గొప్ప విషయం. జాలీ ఎల్.ఎల్.బి, టాయిలెట్ ఏక్ ప్రేం కథ, ఏయిర్ లిఫ్ట్, ప్యాడ్ మాన్, కేసరి, మిషన్ మంగళ్, సినిమాలలో పాటు హౌజ్ ఫుల్ సిరీస్ లో కూడా నటించి సూపర్ హిట్స్ అందుకున్నాడు.
కాగా తాజాగా తెలుగు, తమిళంలో సూపర్ హిట్ అయిన హర్రర్ కామెడీ కాంచన రీమేక్ లక్ష్మీ బాంబ్ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కి జంటగా బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కియారా అద్వాని నటించగా ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఎప్పటిలాగే పర్ఫార్మెన్స్ పరంగా అక్షయ్ కుమార్ బాగానే చేశాడు. ఇక కియారా హాట్ హీరోయిన్ గా కరెక్ట్ గా సెట్ అయిందన్న టాక్ వచ్చింది.
అయితే ఇప్పటికే తెలుగు, తమిళం లో చూసిన ప్రభావమా లేక నిజంగానే ప్రేక్షకులు ఊహించుకున్నంత రేంజ్ మాత్రం లేదని ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. ఫుల్ స్వింగ్ లో ఉన్న అక్షయ్ కుమార్ ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో అని ఆతృతగా చూస్తున్న ప్రేక్షకులు దాదాపు డిసప్పాయింట్ అయ్యారని చెప్పుకుంటున్నారు.
కాని రిలీజైన ఒక్కరోజులోనే ఈ సినిమా ట్రైలర్ రికార్డ్ క్రియేట్ చేయడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక్క యూట్యూబ్ నుంచి ఈ ట్రైలర్ కు 37.2 మిలియన్ వ్యూస్ రాగా మిగతా సామాజిక మాధ్యమాలతో కలిపి మొత్తం 70 మిలియన్ వ్యూస్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే మన ఇండియన్ సినిమాలో రికార్డ్ అని సమాచారం. అయితే ఏమీ లేకపోయినా ఈ రికార్డ్ ఎలా సాధ్యమైంది అన్న ప్రశ్న చాలా మందిలో కలగగా తెలిసిన విషయం ఏమిటంటే ఏదో ఉందని ఆవేశ పడి చూసిన కారణగా ఈ రికార్డ్ క్రియేట్ అయిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా నవంబర్ 9న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ స్ట్రీమింగ్ రిలీజ్ తో పాటు కొన్ని దేశాల్లో థియేట్రికల్ రిలీజ్ కానుంది.