ఆల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా డ్రోన్ దాడులు నిర్వహించి హతమార్చింది. అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ లో డ్రోన్ డ్రోన్ దాడులతో మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. ఈ ఆపరేషన్ తో 2001 సెప్టెంబర్ 11 దాడుల బాధితులకు న్యాయం జరిగిందని బైడెన్ అన్నారు. కాబుల్ డౌన్ టౌన్ లోని ఓ ఇంట్లో ఆల్ జవహరి తన కుటుంబంతో ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారని బైడెన్ తెలిపారు. అమెరికా ప్రజలకు హాని చేస్తే ఎక్కడున్నా వదలమనీ, ఎంత కాలమైనా, ఎక్కడ తలదాచుకున్నా మట్టుబెడతామని పేర్కొంటూ అమెరికా ఇంటిలిజెన్స్ అధికారుల నైపుణ్యం, పట్టుదలకు ఈ సందర్భంగా బైడెన్ ధన్యవాదాలు తెలియజేశారు.
ఆల్ జవహరి ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ల్లో ఒకరిగా ఉన్నారు. 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై జరిపిన ఉగ్రదాడిలో మూడు వేల మంది మరణించారు. ఈ దాడికి పాల్పడిన సూత్రదారుల్లో అలా జవహరి ఒకరిగా అమెరికా గుర్తించింది. అప్పటి నుండి జవహరి పరారీలోనే ఉన్నాడు. అమెరికా దళాలు 2011 లో ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చి తర్వాత ఆల్ ఖైదా పగ్గాలను జవహరి స్వీకరించాడు. జవహరి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు ను యూఎస్ ప్రకటించింది.
అమెరికా డ్రోన్ దాడిని ఖండించిన తాలిబన్లు
అమెరికా డ్రోన్ దాడిలో ఆల్ ఖైదా చీఫ్ జవహారిని మట్టుబెట్టడంపై తాలిబన్లు స్పందించారు. అమెరికా చర్య అంతర్జాతీయ నిబంధనలకు విరుద్దమని జవహారిపై దాడిని ఖండిస్తున్నట్లు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహీద్ పేర్కొన్నారు. 2020 లో జరిగిన అమెరికా బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని అమెరికా అతిక్రమించిందన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?